‘మళ్ళీ రావా’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాాడు గౌతమ్ తిన్ననూరి. ఫాంలో లేని సుమంత్తో ఆ సినిమా తీసి హిట్టు కొట్టడంతో తనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక నానితో చేసిన ‘జెర్సీ’ ఎంత గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుందో తెలిసిందే. ఆ సినిమాతో అతడికి డిమాండ్ పెరిగి.. ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.
వీరి కలయికలో సినిమాకు దాదాపు అంతా సిద్ధమైనట్లే కనిపించింది. కానీ కొన్ని నెలల ప్రయాణం తర్వాత.. ఈ ప్రాజెక్టును గౌతమ్, చరణ్ క్యాన్సిల్ చేసుకున్నారు. మరి ఏమైందన్నది ఎవరికీ తెలియదు. తర్వాత విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ను మొదలుపెట్టాడు గౌతమ్. చరణ్ రిజెక్ట్ చేసిన కథనే విజయ్తో గౌతమ్ తీశాడని ఒక టైంలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
చరణ్కు తాను చెప్పిన కథ వేరని.. విజయ్తో తీసింది వేరే కథ అని అతను స్పష్టం చేశాడు. చరణ్తో సినిమా ఎందుకు వర్కవుట్ కాలేదో కూడా అతను వెల్లడించాడు. ముందు గౌతమ్ చెప్పిన ఒక లైన్ నచ్చి చరణ్ సినిమాకు అంగీకారం తెలిపాడట. ఐతే ఆ ఐడియాతో కథను రెడీ చేశాక.. అది చరణ్కు కరెక్ట్ కాదని తనకే అనిపించి ఆ కథను ఆపేశానని గౌతమ్ వెల్లడించాడు. చరణ్తో సినిమా చేయడం అన్నది గొప్ప అవకాశమని.. ఆ ఛాన్స్ వచ్చింది కదా అని హడావుడిగా ఏదో ఒకటి తీసేయడం కరెక్ట్ కాదనిపించిందని గౌతమ్ తెలిపాడు.
మళ్లీ ఓ మంచి కథ సిద్ధమై, దాని మీద పూర్తిగా సంతృప్తి చెందితే వెళ్లి చరణ్తో కచ్చితంగా సినిమా చేస్తానని గౌతమ్ తెలిపాడు. చరణ్తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని.. తరచుగా మాట్లాడుకుంటూ ఉంటామని అతను చెప్పాడు. తన తొలి చిత్రం ‘మళ్ళీ రావా’ కథను విజయ్ దేవరకొండకే చెప్పడానికి ప్రయత్నించానని.. కానీ ‘పెళ్ళిచూపులు’ హిట్టయిన ఉత్సాహంలో విజయ్ ఆ కథ వినలేదని.. తర్వాత చూద్దాం అన్నాడని గౌతమ్ తెలిపాడు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…