మన హీరోల గొప్పదనం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. వేరే ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మన హీరోలను కొనియాడితే.. అది ఫ్యాన్స్కు మాంచి కిక్ ఇస్తుంది. బాలీవుడ్లో టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. మన జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించేసరికి తన ఫ్యాన్స్ చాలా ఖుషీ అయిపోతున్నారు.
ఎన్టీఆర్ను అందరూ ఏకసంతాగ్రాహి అని.. డైలాగ్ అయినా, ఒక డ్యాన్స్ మూమెంట్ అయినా.. పెద్దగా ప్రాక్టీస్ చేయకుండానే ఈజీగా లాగించేస్తాడని టాలీవుడ్లో తనతో కలిసి పని చేసిన వాళ్లందరూ చెబుతుంటారు. ఇప్పుడు ఇదే మాటను హృతిక్ కూడా చెప్పడమే ఫ్యాన్స్ సంబరానికి కారణం. ‘వార్-2’లో తారక్తో కలిసి హృతిక్ పని చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్లలో వీళ్లిద్దరూ ఉంటారు. ఇలాంటి టాప్ డ్యాన్సర్లు కలిసి ఒక పాట కోసం స్టెప్పులు వేశారు. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ పాట గురించి స్పందిస్తూ.. ఎన్టీఆర్ స్పెషల్ టాలెంట్ గురించి హృతిక్ ప్రస్తావించాడు. తాను ఇప్పటిదాకా పని చేసిన కోస్టార్లలో.. అసలు రిహార్సల్సే లేకుండా స్టెప్పులేసే ఏకైక హీరో తారకే అని హృతిక్ కొనియాడాడు. అతను ఏమాత్రం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని.. డ్యాన్స్ మూమెంట్స్ ఇన్బిల్ట్గా తన బాడీలో ఉంటాయని హృతిక్ అన్నాడు.
తారక్లోని ఈ ప్రతిభ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు.. తనతో కలిసి పని చేయడాన్ని ఎంతో ఆస్వాదించినట్లు హృతిక్ తెలిపాడు. మరి ఈ టాప్ డ్యాన్సర్లు ఇద్దరూ కలిసి చేసిన పాటలో ఎంత ఊపు ఉంటుందో.. రేప్పొద్దున థియేటర్లను ఈ సాంగ్ ఎలా షేక్ చేస్తుందో చూడాలి. ‘వార్-2’ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
This post was last modified on August 4, 2025 10:54 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…