మన హీరోల గొప్పదనం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. వేరే ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మన హీరోలను కొనియాడితే.. అది ఫ్యాన్స్కు మాంచి కిక్ ఇస్తుంది. బాలీవుడ్లో టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. మన జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసలు కురిపించేసరికి తన ఫ్యాన్స్ చాలా ఖుషీ అయిపోతున్నారు.
ఎన్టీఆర్ను అందరూ ఏకసంతాగ్రాహి అని.. డైలాగ్ అయినా, ఒక డ్యాన్స్ మూమెంట్ అయినా.. పెద్దగా ప్రాక్టీస్ చేయకుండానే ఈజీగా లాగించేస్తాడని టాలీవుడ్లో తనతో కలిసి పని చేసిన వాళ్లందరూ చెబుతుంటారు. ఇప్పుడు ఇదే మాటను హృతిక్ కూడా చెప్పడమే ఫ్యాన్స్ సంబరానికి కారణం. ‘వార్-2’లో తారక్తో కలిసి హృతిక్ పని చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్లలో వీళ్లిద్దరూ ఉంటారు. ఇలాంటి టాప్ డ్యాన్సర్లు కలిసి ఒక పాట కోసం స్టెప్పులు వేశారు. ఈ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ పాట గురించి స్పందిస్తూ.. ఎన్టీఆర్ స్పెషల్ టాలెంట్ గురించి హృతిక్ ప్రస్తావించాడు. తాను ఇప్పటిదాకా పని చేసిన కోస్టార్లలో.. అసలు రిహార్సల్సే లేకుండా స్టెప్పులేసే ఏకైక హీరో తారకే అని హృతిక్ కొనియాడాడు. అతను ఏమాత్రం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని.. డ్యాన్స్ మూమెంట్స్ ఇన్బిల్ట్గా తన బాడీలో ఉంటాయని హృతిక్ అన్నాడు.
తారక్లోని ఈ ప్రతిభ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు.. తనతో కలిసి పని చేయడాన్ని ఎంతో ఆస్వాదించినట్లు హృతిక్ తెలిపాడు. మరి ఈ టాప్ డ్యాన్సర్లు ఇద్దరూ కలిసి చేసిన పాటలో ఎంత ఊపు ఉంటుందో.. రేప్పొద్దున థియేటర్లను ఈ సాంగ్ ఎలా షేక్ చేస్తుందో చూడాలి. ‘వార్-2’ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
This post was last modified on August 4, 2025 10:54 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…