ఒక ఏడాది క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ టీజర్ రిలీజైన విషయం ఫ్యాన్స్ కి గుర్తుండే ఉంటుంది. సరే వచ్చింది కదా సినిమా విడుదల దగ్గర్లోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే నెలలు గడిచిపోయాయి కానీ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సుమారు నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉంది. దీనికన్నా చాలా ఆలస్యంగా సాయిశ్రీనివాస్ సంతకం చేసిన వాటిలో భైరవం ఆల్రెడీ వచ్చేయగా కిష్కిందపురి సెప్టెంబర్ మూడో వారంలో రానుంది. కానీ టైసన్ నాయిడు వ్యవహారం ఎటూ తేలడం లేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం అఖండ 2 మీదే టైసన్ నాయుడు భారం వేశాడట. ఎందుకంటే రెండు సినిమాల నిర్మాతలు 14 రీల్స్ కావడంతో బాలయ్య మూవీ బిజినెస్ టైంలో రెండూ ఒక ప్యాకేజీగా ఇవ్వాలనే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అఖండ 2కి విపరీతమైన డిమాండ్ ఉన్న దృష్ట్యా ఇదేమి పెద్ద సమస్య కాదు. పైగా సాయిశ్రీనివాస్ కు వ్యక్తిగతంగా ఉన్న మార్కెట్ ఎలాగూ థియేటర్ రెవిన్యూ తీసుకొస్తుంది. కాకపోతే టాలీవుడ్ కు చాలా గ్యాప్ తీసుకోవడం, భైరవం నిరాశపరచడం లాంటివి మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇక్కడ ప్రమోషన్ కంటెంట్ కీలక పాత్ర పోషించనుంది.
టైసన్ నాయుడులో సాయిశ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. పాయింట్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారట. బడ్జెట్ ఎక్కువ కావడం వల్లే ఆర్థికంగా కొన్ని చిక్కులు వచ్చాయనే టాక్ లేకపోలేదు. దీని వల్లే సాగర్ కె చంద్ర ఏళ్ళ తరబడి ఈ ప్రాజెక్టు మీదే వర్క్ చేస్తున్నారు. నభ నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చడం విశేషం. ఇన్ని ఆకర్షణలు ఉన్నా ఇంత ఆలస్యం కావడం విచిత్రమే. సాయిశ్రీనివాస్ చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ కూడా ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. ఎటు చూసినా ఈ ఏడాదిలోనే టైసన్ నాయుడుకి మోక్షం దక్కేలా ఉందని యూనిట్ టాక్.
This post was last modified on July 30, 2025 3:48 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…