తెర మీద పాత్రలు ఒకరినొకరు చితగ్గొట్టేసుకున్నట్లు చూపిస్తారు కానీ.. అదంతా అబద్ధం అని అందరికీ తెలుసు. పాత్రలో లీనమై నటించే క్రమంలో కొన్ని సందర్భాల్లో మాత్రం అవతలి వాళ్లను నిజంగానే కొట్టేయడం జరుగుతుంటుంది. కానీ సన్నివేశం సహజంగా అనిపించడం కోసం ఒక నటిని ఒక హీరో 15 సార్లు చెంపదెబ్బ కొట్టాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ పని సీనియర్ హీరో అక్కినే నాగార్జున చేశాడట. ‘చంద్రలేఖ’ సినిమాలో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ను ఆయన అన్నిసార్లు లెంపకాయ కొట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇషానే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘చంద్రలేఖ’లో ఒక సన్నివేశంలో నాగార్జున.. ఇషాను చెంపదెబ్బ కొడతాడన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సన్నివేశం సహజంగా రావడం కోసం చాలాసార్లు రీటేక్ చేయాల్సి వచ్చిందట. నాగ్.. సుతారంగా చెంపదెబ్బ కొడుతుంటే, తనకు దెబ్బ తిన్న ఫీలింగే రాలేదని ఇషా చెప్పింది. అవతలి వ్యక్తి లెంపకాయ కొట్టినపుడు ముఖంలో కోపం రావాలని.. ఆ ఎక్స్ప్రెషన్ కోసమే దర్శకుడు కృష్ణవంశీ అడుగుతున్నాడని.. కానీ తాను మాత్రం అది ఇవ్వలేకపోయానని ఇషా చెప్పింది.
తనను నిజంగానే చెంపదెబ్బ కొట్టమని నాగ్ను అడిగితే, ఆయన అలా చేయలేనని చెప్పాడని.. ఆయన మెల్లగా కొడుతుంటే తనకు దెబ్బ తిన్న ఫీలింగ్ రాక, ఎక్స్ప్రెషన్ సరిగా ఇవ్వలేకపోయానని ఇషా చెప్పింది. ఇలా 15 సార్లు తాను నాగ్ దగ్గర చెంపదెబ్బ తిన్నానని.. చివరికి గట్టిగా కొట్టడంతో ఆ ఫీల్ వచ్చి సరైన ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగానని ఇషా తెలిపింది. తనను గట్టిగా కొట్టాక నాగ్ వచ్చి సారీ చెప్పాడని.. ఐతే అది తాను కోరుకున్నదే కాబట్టి, సారీ ఎందుకు అని వారించానని ఇషా తెలిపింది. ఓ మలయాళ హిట్ చిత్రానికి రీమేక్గా వచ్చిన ‘చంద్రలేఖ’ ఫ్లాప్ అయింది. దీంతో ఇషా తెలుగులో మళ్లీ కథానాయికగా ఇంకో సినిమా చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత నిఖిల్ మూవీ ‘కేశవ’లో ఆమె ఒక ప్రత్యేక పాత్ర పోషించింది.
This post was last modified on July 30, 2025 1:24 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…