తెర మీద పాత్రలు ఒకరినొకరు చితగ్గొట్టేసుకున్నట్లు చూపిస్తారు కానీ.. అదంతా అబద్ధం అని అందరికీ తెలుసు. పాత్రలో లీనమై నటించే క్రమంలో కొన్ని సందర్భాల్లో మాత్రం అవతలి వాళ్లను నిజంగానే కొట్టేయడం జరుగుతుంటుంది. కానీ సన్నివేశం సహజంగా అనిపించడం కోసం ఒక నటిని ఒక హీరో 15 సార్లు చెంపదెబ్బ కొట్టాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ పని సీనియర్ హీరో అక్కినే నాగార్జున చేశాడట. ‘చంద్రలేఖ’ సినిమాలో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ను ఆయన అన్నిసార్లు లెంపకాయ కొట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇషానే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘చంద్రలేఖ’లో ఒక సన్నివేశంలో నాగార్జున.. ఇషాను చెంపదెబ్బ కొడతాడన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సన్నివేశం సహజంగా రావడం కోసం చాలాసార్లు రీటేక్ చేయాల్సి వచ్చిందట. నాగ్.. సుతారంగా చెంపదెబ్బ కొడుతుంటే, తనకు దెబ్బ తిన్న ఫీలింగే రాలేదని ఇషా చెప్పింది. అవతలి వ్యక్తి లెంపకాయ కొట్టినపుడు ముఖంలో కోపం రావాలని.. ఆ ఎక్స్ప్రెషన్ కోసమే దర్శకుడు కృష్ణవంశీ అడుగుతున్నాడని.. కానీ తాను మాత్రం అది ఇవ్వలేకపోయానని ఇషా చెప్పింది.
తనను నిజంగానే చెంపదెబ్బ కొట్టమని నాగ్ను అడిగితే, ఆయన అలా చేయలేనని చెప్పాడని.. ఆయన మెల్లగా కొడుతుంటే తనకు దెబ్బ తిన్న ఫీలింగ్ రాక, ఎక్స్ప్రెషన్ సరిగా ఇవ్వలేకపోయానని ఇషా చెప్పింది. ఇలా 15 సార్లు తాను నాగ్ దగ్గర చెంపదెబ్బ తిన్నానని.. చివరికి గట్టిగా కొట్టడంతో ఆ ఫీల్ వచ్చి సరైన ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగానని ఇషా తెలిపింది. తనను గట్టిగా కొట్టాక నాగ్ వచ్చి సారీ చెప్పాడని.. ఐతే అది తాను కోరుకున్నదే కాబట్టి, సారీ ఎందుకు అని వారించానని ఇషా తెలిపింది. ఓ మలయాళ హిట్ చిత్రానికి రీమేక్గా వచ్చిన ‘చంద్రలేఖ’ ఫ్లాప్ అయింది. దీంతో ఇషా తెలుగులో మళ్లీ కథానాయికగా ఇంకో సినిమా చేయలేదు. చాలా ఏళ్ల తర్వాత నిఖిల్ మూవీ ‘కేశవ’లో ఆమె ఒక ప్రత్యేక పాత్ర పోషించింది.
This post was last modified on July 30, 2025 1:24 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…