Movie News

క్రిష్ మౌనవ్రతం వెనుక మతలబు

హరిహర వీరమల్లు విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా ఒక ఈవెంట్ లేదా ఇంటర్వ్యూలో మాట్లాడతారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ నెరవేరలేదు. రిలీజ్ కు ముందు రోజు సుదీర్ఘంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ వేశారు తప్పించి అంతకు మించి ఎలాంటి పబ్లిసిటీలో భాగం కాలేదు. ఒకవేళ ఆయన తీసింది సగం సినిమానే అయినా దాని కోసమైనా కెమెరా ముందుకు రావాల్సిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ అసలు మతలబు ఏంటో సినిమా చూశాక, జ్యోతి కృష్ణ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ చూశాక అర్థమయ్యింది.

అయిదేళ్ల క్రితం ఈ కథను రాసుకున్నప్పుడు క్రిష్ అనుకున్న ట్రీట్ మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది కాదు. కోహినూర్ వజ్రం చుట్టూ కథను నడిపించి మాయాబజార్ తరహాలో ఎంటర్ టైన్మెంట్ ప్లస్ పీరియాడిక్ యాక్షన్ గా ప్లాన్ చేసుకున్నారు. కానీ జాప్యాలు, వాయిదాలు, అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో క్రిష్ బయటికి వచ్చాడు. జ్యోతికృష్ణ చేతికి వచ్చేటప్పటికీ అదే స్పాన్, అదే టెంపోలో తీసే అవకాశం కనిపించలేదు. దీంతో కీలక మార్పులు చేసుకుని కొత్త పాయింట్లు జోడించి వేరే వెర్షన్ సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా మనం సెకండాఫ్ లో చూస్తున్నది ఇదే.

ఇదంతా జ్యోతికృష్ణనే చెప్పుకొచ్చారు కాబట్టి ఉత్తి ప్రచారమని కొట్టి పారేయడానికి లేదు. విఎఫెక్స్, నిడివి మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని కొత్త రీ లోడెడ్ వెర్షన్ ని మొన్నటి నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు కానీ వసూళ్ల మీద దాని ప్రభావం చెప్పుకునే స్థాయిలో కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ ఏమో కానీ ముప్పాతిక రికవర్ అయినా గొప్పే అనేలా పరిస్థితి మారిపోయింది. ఒకపక్క మహావతార్ నరసింహా అంతకంతా పెట్రేగిపోతుండగా సైయారా సైతం దూసుకుపోతోంది. ఎటొచ్చి వీరమల్లునే ఎదురీదాల్సి వస్తోంది. ఘాటీ ప్రమోషన్లకు బయటికి వచ్చినప్పుడు క్రిష్ ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.

This post was last modified on July 29, 2025 10:49 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

38 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago