హరిహర వీరమల్లు విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా ఒక ఈవెంట్ లేదా ఇంటర్వ్యూలో మాట్లాడతారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ నెరవేరలేదు. రిలీజ్ కు ముందు రోజు సుదీర్ఘంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ వేశారు తప్పించి అంతకు మించి ఎలాంటి పబ్లిసిటీలో భాగం కాలేదు. ఒకవేళ ఆయన తీసింది సగం సినిమానే అయినా దాని కోసమైనా కెమెరా ముందుకు రావాల్సిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ అసలు మతలబు ఏంటో సినిమా చూశాక, జ్యోతి కృష్ణ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ చూశాక అర్థమయ్యింది.
అయిదేళ్ల క్రితం ఈ కథను రాసుకున్నప్పుడు క్రిష్ అనుకున్న ట్రీట్ మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది కాదు. కోహినూర్ వజ్రం చుట్టూ కథను నడిపించి మాయాబజార్ తరహాలో ఎంటర్ టైన్మెంట్ ప్లస్ పీరియాడిక్ యాక్షన్ గా ప్లాన్ చేసుకున్నారు. కానీ జాప్యాలు, వాయిదాలు, అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో క్రిష్ బయటికి వచ్చాడు. జ్యోతికృష్ణ చేతికి వచ్చేటప్పటికీ అదే స్పాన్, అదే టెంపోలో తీసే అవకాశం కనిపించలేదు. దీంతో కీలక మార్పులు చేసుకుని కొత్త పాయింట్లు జోడించి వేరే వెర్షన్ సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా మనం సెకండాఫ్ లో చూస్తున్నది ఇదే.
ఇదంతా జ్యోతికృష్ణనే చెప్పుకొచ్చారు కాబట్టి ఉత్తి ప్రచారమని కొట్టి పారేయడానికి లేదు. విఎఫెక్స్, నిడివి మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని కొత్త రీ లోడెడ్ వెర్షన్ ని మొన్నటి నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు కానీ వసూళ్ల మీద దాని ప్రభావం చెప్పుకునే స్థాయిలో కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ ఏమో కానీ ముప్పాతిక రికవర్ అయినా గొప్పే అనేలా పరిస్థితి మారిపోయింది. ఒకపక్క మహావతార్ నరసింహా అంతకంతా పెట్రేగిపోతుండగా సైయారా సైతం దూసుకుపోతోంది. ఎటొచ్చి వీరమల్లునే ఎదురీదాల్సి వస్తోంది. ఘాటీ ప్రమోషన్లకు బయటికి వచ్చినప్పుడు క్రిష్ ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.
This post was last modified on July 29, 2025 10:49 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…