Movie News

క్రిష్ మౌనవ్రతం వెనుక మతలబు

హరిహర వీరమల్లు విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా ఒక ఈవెంట్ లేదా ఇంటర్వ్యూలో మాట్లాడతారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ నెరవేరలేదు. రిలీజ్ కు ముందు రోజు సుదీర్ఘంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ వేశారు తప్పించి అంతకు మించి ఎలాంటి పబ్లిసిటీలో భాగం కాలేదు. ఒకవేళ ఆయన తీసింది సగం సినిమానే అయినా దాని కోసమైనా కెమెరా ముందుకు రావాల్సిందని అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ అసలు మతలబు ఏంటో సినిమా చూశాక, జ్యోతి కృష్ణ పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ చూశాక అర్థమయ్యింది.

అయిదేళ్ల క్రితం ఈ కథను రాసుకున్నప్పుడు క్రిష్ అనుకున్న ట్రీట్ మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది కాదు. కోహినూర్ వజ్రం చుట్టూ కథను నడిపించి మాయాబజార్ తరహాలో ఎంటర్ టైన్మెంట్ ప్లస్ పీరియాడిక్ యాక్షన్ గా ప్లాన్ చేసుకున్నారు. కానీ జాప్యాలు, వాయిదాలు, అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో క్రిష్ బయటికి వచ్చాడు. జ్యోతికృష్ణ చేతికి వచ్చేటప్పటికీ అదే స్పాన్, అదే టెంపోలో తీసే అవకాశం కనిపించలేదు. దీంతో కీలక మార్పులు చేసుకుని కొత్త పాయింట్లు జోడించి వేరే వెర్షన్ సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా మనం సెకండాఫ్ లో చూస్తున్నది ఇదే.

ఇదంతా జ్యోతికృష్ణనే చెప్పుకొచ్చారు కాబట్టి ఉత్తి ప్రచారమని కొట్టి పారేయడానికి లేదు. విఎఫెక్స్, నిడివి మీద వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని కొత్త రీ లోడెడ్ వెర్షన్ ని మొన్నటి నుంచి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు కానీ వసూళ్ల మీద దాని ప్రభావం చెప్పుకునే స్థాయిలో కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ ఏమో కానీ ముప్పాతిక రికవర్ అయినా గొప్పే అనేలా పరిస్థితి మారిపోయింది. ఒకపక్క మహావతార్ నరసింహా అంతకంతా పెట్రేగిపోతుండగా సైయారా సైతం దూసుకుపోతోంది. ఎటొచ్చి వీరమల్లునే ఎదురీదాల్సి వస్తోంది. ఘాటీ ప్రమోషన్లకు బయటికి వచ్చినప్పుడు క్రిష్ ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.

This post was last modified on July 29, 2025 10:49 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago