అనుష్క ఘాటీ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 18, జూలై 11 ఈ ఏడాది వదులుకున్న డేట్లు. వీటిలో ఏ తేదీకి వచ్చినా మంచి ఓపెనింగ్స్ తో పాటు సాలిడ్ రన్ దక్కేది. కానీ రకరకాల కారణాల వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ లాంటి రీజన్స్ చెబుతున్నారు కానీ నిజానికి అంత హెవీ వర్క్ ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా అయితే ఇది కాదు. మరి ఎందుకు లేట్ అవుతుందనేది అంతు చిక్కడం లేదు. ఫిలిం నగర్ వర్గాల్లో సెప్టెంబర్ 5 రావొచ్చనే ప్రచారం మొన్నటిదాకా జరిగింది. కానీ ఇప్పుడా సౌండ్ లేదు. ఎందుకంటే తేజ సజ్జ మిరాయ్ అదే డేట్ కి ముందు ప్రకటించినట్టుగా రిలీజ్ కాబోతోంది కాబట్టి.
ముందైతే ఘాటీ నిర్మాతలు యువి క్రియేషన్స్ మౌనం వీడాలి. చూచాయగా ఎప్పుడు వస్తుందో హింట్ ఇవ్వాలి. ఇదే తరహాలో విశ్వంభరని విపరీతమైన జాప్యానికి గురి చేసిన ప్రొడ్యూసర్లు దాని బజ్ తగ్గిపోవడంలో టీజర్ తో పాటు సమాన బాధ్యత పంచుకున్నారు. ఇప్పుడు ఘాటీకి కూడా ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు. హరిహర వీరమల్లుకు ట్విట్టర్ లో విష్ చేసి ఊరుకున్నాడు తప్పించి తన వంతుగా మీడియా ముందుకొచ్చి విశేషాలు పంచుకోలేదు. సరే ఘాటీ పనుల్లో బిజీగా ఉన్నాడని అనుకున్నా కనీసం ఒకటి రెండు రోజులు తీరిక చేసుకోవచ్చు కదా.
ఇక అనుష్క సంగతి సరేసరి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్క్రీన్ మీద, స్క్రీన్ బయట ఎక్కడా దర్శనమివ్వలేదు. ఘాటీ ప్రమోషన్లకైనా వస్తుందో రాదో తెలియదు. తన మీద ఎన్ని గాసిప్స్ వస్తున్నా పట్టించుకోకుండా అజ్ఞాతంలోనే ఉన్న స్వీటీని ఓసారైనా నేరుగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక నెరవేరేలా లేదు. స్వీటీని ఎప్పుడు చూస్తామంటూ ప్రశ్నించడమే తప్ప సమాధానం దొరకడం లేదు. ఒకవేళ ఘాటీ కనక సెప్టెంబర్ వదులుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఏదో ఒకటి వీలైనంత త్వరగా లాక్ చేసుకోవాలి. లేదంటే బజ్ మరింత కిందకు వెళ్లిపోయే ప్రమాదముంది. ఫ్యాన్స్ భయపడుతోంది అదే.
This post was last modified on July 28, 2025 9:19 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…