అనుష్క ఘాటీ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 18, జూలై 11 ఈ ఏడాది వదులుకున్న డేట్లు. వీటిలో ఏ తేదీకి వచ్చినా మంచి ఓపెనింగ్స్ తో పాటు సాలిడ్ రన్ దక్కేది. కానీ రకరకాల కారణాల వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ లాంటి రీజన్స్ చెబుతున్నారు కానీ నిజానికి అంత హెవీ వర్క్ ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా అయితే ఇది కాదు. మరి ఎందుకు లేట్ అవుతుందనేది అంతు చిక్కడం లేదు. ఫిలిం నగర్ వర్గాల్లో సెప్టెంబర్ 5 రావొచ్చనే ప్రచారం మొన్నటిదాకా జరిగింది. కానీ ఇప్పుడా సౌండ్ లేదు. ఎందుకంటే తేజ సజ్జ మిరాయ్ అదే డేట్ కి ముందు ప్రకటించినట్టుగా రిలీజ్ కాబోతోంది కాబట్టి.
ముందైతే ఘాటీ నిర్మాతలు యువి క్రియేషన్స్ మౌనం వీడాలి. చూచాయగా ఎప్పుడు వస్తుందో హింట్ ఇవ్వాలి. ఇదే తరహాలో విశ్వంభరని విపరీతమైన జాప్యానికి గురి చేసిన ప్రొడ్యూసర్లు దాని బజ్ తగ్గిపోవడంలో టీజర్ తో పాటు సమాన బాధ్యత పంచుకున్నారు. ఇప్పుడు ఘాటీకి కూడా ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు. హరిహర వీరమల్లుకు ట్విట్టర్ లో విష్ చేసి ఊరుకున్నాడు తప్పించి తన వంతుగా మీడియా ముందుకొచ్చి విశేషాలు పంచుకోలేదు. సరే ఘాటీ పనుల్లో బిజీగా ఉన్నాడని అనుకున్నా కనీసం ఒకటి రెండు రోజులు తీరిక చేసుకోవచ్చు కదా.
ఇక అనుష్క సంగతి సరేసరి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్క్రీన్ మీద, స్క్రీన్ బయట ఎక్కడా దర్శనమివ్వలేదు. ఘాటీ ప్రమోషన్లకైనా వస్తుందో రాదో తెలియదు. తన మీద ఎన్ని గాసిప్స్ వస్తున్నా పట్టించుకోకుండా అజ్ఞాతంలోనే ఉన్న స్వీటీని ఓసారైనా నేరుగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక నెరవేరేలా లేదు. స్వీటీని ఎప్పుడు చూస్తామంటూ ప్రశ్నించడమే తప్ప సమాధానం దొరకడం లేదు. ఒకవేళ ఘాటీ కనక సెప్టెంబర్ వదులుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఏదో ఒకటి వీలైనంత త్వరగా లాక్ చేసుకోవాలి. లేదంటే బజ్ మరింత కిందకు వెళ్లిపోయే ప్రమాదముంది. ఫ్యాన్స్ భయపడుతోంది అదే.
This post was last modified on July 28, 2025 9:19 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…