అనుష్క ఘాటీ ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 18, జూలై 11 ఈ ఏడాది వదులుకున్న డేట్లు. వీటిలో ఏ తేదీకి వచ్చినా మంచి ఓపెనింగ్స్ తో పాటు సాలిడ్ రన్ దక్కేది. కానీ రకరకాల కారణాల వల్ల పోస్ట్ పోన్ తప్పలేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ లాంటి రీజన్స్ చెబుతున్నారు కానీ నిజానికి అంత హెవీ వర్క్ ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా అయితే ఇది కాదు. మరి ఎందుకు లేట్ అవుతుందనేది అంతు చిక్కడం లేదు. ఫిలిం నగర్ వర్గాల్లో సెప్టెంబర్ 5 రావొచ్చనే ప్రచారం మొన్నటిదాకా జరిగింది. కానీ ఇప్పుడా సౌండ్ లేదు. ఎందుకంటే తేజ సజ్జ మిరాయ్ అదే డేట్ కి ముందు ప్రకటించినట్టుగా రిలీజ్ కాబోతోంది కాబట్టి.
ముందైతే ఘాటీ నిర్మాతలు యువి క్రియేషన్స్ మౌనం వీడాలి. చూచాయగా ఎప్పుడు వస్తుందో హింట్ ఇవ్వాలి. ఇదే తరహాలో విశ్వంభరని విపరీతమైన జాప్యానికి గురి చేసిన ప్రొడ్యూసర్లు దాని బజ్ తగ్గిపోవడంలో టీజర్ తో పాటు సమాన బాధ్యత పంచుకున్నారు. ఇప్పుడు ఘాటీకి కూడా ఇంచుమించు అదే పరిస్థితి కనిపిస్తోంది. దర్శకుడు క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు. హరిహర వీరమల్లుకు ట్విట్టర్ లో విష్ చేసి ఊరుకున్నాడు తప్పించి తన వంతుగా మీడియా ముందుకొచ్చి విశేషాలు పంచుకోలేదు. సరే ఘాటీ పనుల్లో బిజీగా ఉన్నాడని అనుకున్నా కనీసం ఒకటి రెండు రోజులు తీరిక చేసుకోవచ్చు కదా.
ఇక అనుష్క సంగతి సరేసరి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్క్రీన్ మీద, స్క్రీన్ బయట ఎక్కడా దర్శనమివ్వలేదు. ఘాటీ ప్రమోషన్లకైనా వస్తుందో రాదో తెలియదు. తన మీద ఎన్ని గాసిప్స్ వస్తున్నా పట్టించుకోకుండా అజ్ఞాతంలోనే ఉన్న స్వీటీని ఓసారైనా నేరుగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆ కోరిక నెరవేరేలా లేదు. స్వీటీని ఎప్పుడు చూస్తామంటూ ప్రశ్నించడమే తప్ప సమాధానం దొరకడం లేదు. ఒకవేళ ఘాటీ కనక సెప్టెంబర్ వదులుకుంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా ఏదో ఒకటి వీలైనంత త్వరగా లాక్ చేసుకోవాలి. లేదంటే బజ్ మరింత కిందకు వెళ్లిపోయే ప్రమాదముంది. ఫ్యాన్స్ భయపడుతోంది అదే.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…