హరిహర వీరమల్లు చూసిన వాళ్లంతా.. ప్రథమార్ధం బాగుందని, ఇంటర్వెల్ బ్యాంగ్లో మంచి హై వచ్చిందని.. కానీ ద్వితీయార్ధమే తేడా కొట్టిందని అంటున్నారు. కోహినూర్ వజ్రాన్ని వీరమల్లు ఎలా తీసుకొస్తాడనే నేపథ్యంలోనే కథను నడిపించి ఉంటే ఆసక్తికరంగా ఉండేదని.. అది వదిలేసి వీరమల్లు ఢిల్లీ ప్రయాణాన్ని, ధర్మ పరిరక్షకుడిగా అతడి ఫ్లాష్ బ్యాక్ను చూపించి కథను పక్కదారి పట్టించారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా కథను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా మధ్యలో సినిమాను తన చేతుల్లోకి తీసుకున్న జ్యోతికృష్ణ క్రియేటివియేనా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం సినిమాను క్రిష్యే డైరెక్ట్ చేసి ఉంటే ఔట్ పుట్ వేరేలా ఉండేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కథ పరంగా మార్పులు చేర్పుల గురించి జ్యోతికృష్ణ స్పందించాడు. క్రిష్ కథను తాము మార్చిన మాట వాస్తవమేనన్నాడు. అందుకు కారణమేంటో అతను వివరించాడు. క్రిష్ కథ పూర్తిగా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరిగేదని.. మాయాబజార్ తరహాలో వినోదాత్మకంగా సాగేలా ఆయన కథను రాసుకున్నారని జ్యోతికృష్ణ తెలిపాడు. ఐతే షూటింగ్కు చాలా సార్లు బ్రేక్ పడడం.. ఆలస్యం కావడంతో ఆ వెర్షన్ను పూర్తి చేయలేకపోయామని జ్యోతికృష్ణ తెలిపాడు.
క్రిష్ వెర్షన్ పూర్తి చేయాలంటే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉండేదని.. పవన్ కాల్ షీట్లు కూడా ఎక్కువ అవసరమని.. అలా చేయడం వీలు కాక కథను మార్చాల్సి వచ్చిందని జ్యోతికృష్ణ తెలిపాడు. క్రిష్ వెర్షన్ కథను హరిహర వీరమల్లు రెండో భాగంలో చూడొచ్చని అతను చెప్పాడు. కానీ ఇప్పుడు మార్చిన కథ వల్ల వీరమల్లు ట్రాక్ తప్పిందన్నది వాస్తవం. సెకండాఫ్ బోరింగ్గా తయారైంది. పైగా పేలవ విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద మైనస్ అయ్యాయి. దీంతో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ పార్ట్కు ఆశించిన ఫలితం రానపుడు ఇక రెండో భాగం తీయడం కష్టమే. అసలు పవన్కూ అంత ఖాళీ లేదు. ఈ సినిమా మీద డబ్బులు పెట్టే స్థితిలో నిర్మాత ఏఎం రత్నమూ లేడు.
This post was last modified on July 27, 2025 11:57 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…