ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 మీద బాలీవుడ్ వర్గాలే కాదు టాలీవుడ్ ట్రేడ్ కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తోంది. కారణం జూనియర్ ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో మొదటిసారి తెరను పంచుకోవడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టీజర్ మీద కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ట్రైలర్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ సరిచేసే ప్రయత్నం చేసింది. ఇప్పటికైతే ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంది కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ కంటెంట్ వదలాల్సిన అవసరం చాలా ఉంది. ఇక వార్ 2 బడ్జెట్, రెమ్యునరేషన్లకు సంబంధించిన కొన్ని విషయాలు ముంబై మీడియాతో పాటు మన దగ్గర కూడా హాట్ టాపిక్ గా మారాయి.
వాటి ప్రకారం వార్ 2 ఇప్పటిదాకా హిందీలో వచ్చిన అత్యంత ఖరీదైన స్పై మూవీ. 400 కోట్ల బడ్జెట్ ఖర్చయ్యిందట. జూనియర్ ఎన్టీఆర్ కు 70 కోట్ల దాకా ఇచ్చారని తెలిసింది. హృతిక్ రోషన్ కు తక్కువగా 50 కోట్లు ఇచ్చినప్పటికీ రిలీజయ్యాక వచ్చిన లాభాల్లో ప్రాఫిట్ షేరింగ్ మీద అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే ఆ సొమ్ము రెట్టింపయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కియారా అద్వానీకి 15 కోట్లు, అనిల్ కపూర్ కు 10 కోట్ల దాకా ముట్టిందట. దర్శకుడు అయాన్ ముఖర్జీకి 30 కోట్ల దాకా కిట్టుబాటు అయ్యిందని వినికిడి. అంటే మొత్తం పారితోషికాలు 150 కోట్లు అయితే మిగిలిన 220 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్.
ఇప్పటిదాకా యష్ ఫిలింస్ ఇంత బడ్జెట్ ఏ గూఢచారి సినిమాకు పెట్టలేదు. మునుపటి రికార్డు 350 కోట్లతో టైగర్ 3, 325 కోట్లతో పఠాన్ పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు వాటిని వార్ 2 ఓవర్ టేక్ చేసింది. ఇంత సొమ్ములు కుమ్మరించారంటే కంటెంట్ ఏదో క్రేజీగా ఉందని అర్థమవుతోంది. ఇప్పటిదాకా ప్రమోషన్ లో వచ్చిన వీడియో కంటెంట్ కేవలం శాంపిల్స్ మాత్రమేనని అసలైన సినిమా చూశాక థ్రిల్ తో ఉక్కిరిబిక్కిరి చేసే ఎపిసోడ్స్ చాలా ఉంటాయని యూనిట్ వర్గాలు ఊరిస్తున్నాయి. అవి నిజమైతేనే కూలి లాంటి విపరీతంమైన హైప్ ఉన్న మూవీ పోటీని తట్టుకోవడానికి సులభమవుతుంది. ఫ్యాన్స్ కోరుతున్నది అదే.
This post was last modified on July 26, 2025 6:32 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…