సుమారు ఏడాది కాలంగా విడుదల వాయిదా వేసుకుంటూ వచ్చిన నారా రోహిత్ సుందరకాండ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్ట్ 27 లాక్ చేస్తూ వీడియో బైట్ రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీదేవి విజయ్ కుమార్ తర్వాత కొన్ని సినిమాలు చేసి టాటా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇంత లేట్ గా వస్తున్నా హీరోయిన్ గానే పునఃప్రవేశం చేయడం గమనించాల్సిన విషయం. డేట్ వినడానికి బాగానే ఉంది కానీ ఆగస్ట్ 27 ఆల్రెడీ రవితేజ మాస్ జాతర లాక్ చేసుకుంది. ఆ మేరకు షూటింగ్ చివరి దశ పరుగులు పెడుతోంది.
మరి నారా రోహిత్ టీమ్ ఏ కాన్ఫిడెన్స్ తో క్లాష్ కు సిద్ధపడిందనేది ఆసక్తికరం. వెంకటేష్ కెరీర్ లో క్లాసిక్ అని చెప్పుకోదగ్గ వాటిలో సుందరకాండ ముందు వరసలో ఉంటుంది. అదే పేరుతో బాపు గారు చార్మీ ప్రధాన పాత్ర లో ఇంకో చిత్రం తీశారు కానీ అది వర్కౌట్ కాలేదు. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత నారా రోహిత్ దాన్ని వాడుకున్నాడు. ఇటీవలే తండ్రి చనిపోయిన విషాదంలో రవితేజ కొద్దిరోజులు బ్రేక్ తీసుకున్నాడు. మాస్ జాతరకు ఒక పాట, ప్యాచ్ వర్క్ తప్ప ఎక్కువ బాలన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. శ్రీలీల డేట్లు ఇంకొన్ని కావాలట. అందుకే ఈ గ్యాప్ లో కిషోర్ తిరుమలకు మాస్ మహారాజా డేట్లు ఇచ్చాడు.
ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 27 మిస్ కాకూడదనేది రవితేజ, నిర్మాత నాగవంశీ టార్గెట్. దానికి అనుగుణంగానే ప్లానింగ్ వేగవంతం చేశారు. ఇంకా థియేటర్ బిజినెస్ మొదలుపెట్టలేదు. కానీ ట్రైలర్ కాగానే ఆ లాంఛనం చేయబోతున్నారు. ప్రస్తుతం సితార టీమ్ కింగ్డమ్ రిలీజ్, వార్ 2 డిస్టిబ్యూషన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. ఇవి కొలిక్కి రాగానే మాస్ జాతర ప్రమోషన్లు వేగవంతం చేయాలి. మాస్ అండ్ ఎంటర్ టైన్మెంట్ రైటర్ గా మంచి పేరున్న భాను భోగవవరపు మాస్ జాతరతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విక్రమార్కుడు ప్లస్ కిక్ క్యారెక్టరైజేషన్స్ ని మిక్స్ చేసి రవితేజని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్టు వినికిడి.
This post was last modified on July 25, 2025 7:25 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…