సుమారు ఏడాది కాలంగా విడుదల వాయిదా వేసుకుంటూ వచ్చిన నారా రోహిత్ సుందరకాండ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్ట్ 27 లాక్ చేస్తూ వీడియో బైట్ రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ తో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీదేవి విజయ్ కుమార్ తర్వాత కొన్ని సినిమాలు చేసి టాటా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇంత లేట్ గా వస్తున్నా హీరోయిన్ గానే పునఃప్రవేశం చేయడం గమనించాల్సిన విషయం. డేట్ వినడానికి బాగానే ఉంది కానీ ఆగస్ట్ 27 ఆల్రెడీ రవితేజ మాస్ జాతర లాక్ చేసుకుంది. ఆ మేరకు షూటింగ్ చివరి దశ పరుగులు పెడుతోంది.
మరి నారా రోహిత్ టీమ్ ఏ కాన్ఫిడెన్స్ తో క్లాష్ కు సిద్ధపడిందనేది ఆసక్తికరం. వెంకటేష్ కెరీర్ లో క్లాసిక్ అని చెప్పుకోదగ్గ వాటిలో సుందరకాండ ముందు వరసలో ఉంటుంది. అదే పేరుతో బాపు గారు చార్మీ ప్రధాన పాత్ర లో ఇంకో చిత్రం తీశారు కానీ అది వర్కౌట్ కాలేదు. తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత నారా రోహిత్ దాన్ని వాడుకున్నాడు. ఇటీవలే తండ్రి చనిపోయిన విషాదంలో రవితేజ కొద్దిరోజులు బ్రేక్ తీసుకున్నాడు. మాస్ జాతరకు ఒక పాట, ప్యాచ్ వర్క్ తప్ప ఎక్కువ బాలన్స్ లేదని ఇన్ సైడ్ టాక్. శ్రీలీల డేట్లు ఇంకొన్ని కావాలట. అందుకే ఈ గ్యాప్ లో కిషోర్ తిరుమలకు మాస్ మహారాజా డేట్లు ఇచ్చాడు.
ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 27 మిస్ కాకూడదనేది రవితేజ, నిర్మాత నాగవంశీ టార్గెట్. దానికి అనుగుణంగానే ప్లానింగ్ వేగవంతం చేశారు. ఇంకా థియేటర్ బిజినెస్ మొదలుపెట్టలేదు. కానీ ట్రైలర్ కాగానే ఆ లాంఛనం చేయబోతున్నారు. ప్రస్తుతం సితార టీమ్ కింగ్డమ్ రిలీజ్, వార్ 2 డిస్టిబ్యూషన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. ఇవి కొలిక్కి రాగానే మాస్ జాతర ప్రమోషన్లు వేగవంతం చేయాలి. మాస్ అండ్ ఎంటర్ టైన్మెంట్ రైటర్ గా మంచి పేరున్న భాను భోగవవరపు మాస్ జాతరతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విక్రమార్కుడు ప్లస్ కిక్ క్యారెక్టరైజేషన్స్ ని మిక్స్ చేసి రవితేజని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నట్టు వినికిడి.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…