ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘హరిహర వీరమల్లు’. ఐతే అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. ప్రథమార్ధం వరకు బాగానే అనిపించినా.. ద్వితీయార్ధంలో సినిమా గాడి తప్పిందన్నది మెజారిటీ ప్రేక్షకులు చెబుతున్న మాట. సెకండాఫ్లో ప్రేక్షకులు ఊహించుకున్నది ఒకటి. అక్కడ కనిపించింది ఒకటి. ఇంటర్వెల్ బ్లాక్ చూశాక హీరో వెళ్లి కోహినూర్ వజ్రాన్ని ఎలా తీసుకొస్తాడా అని చూస్తే.. ఢిల్లీ వరకు తన జర్నీతో లాగించేశాడు దర్శకుడు జ్యోతికృష్ణ. మధ్యలో ధర్మ పరిరక్షకుడిగా తన పాత్రలోని మరో కోణాన్ని చూపించి కథను డీవియేట్ చేశాడనే అభిప్రాయం కలిగింది.
చివర్లో ఒక తుపాను ఎపిసోడ్తో సినిమాను మొక్కుబడిగా ముగించారు. ఔరంగజేబుతో తన పోరాటమే చూపించలేదు. కోహినూర్ వజ్రం సంగతి కూడా పక్కకు వెళ్లిపోయింది. ఇదంతా పార్ట్-2లో చూసుకోమన్నట్లుగా ఎండ్ కార్డ్ వేశారు. ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న ఎపిసోడ్ల తాలూకు క్రెడిట్ క్రిష్కే కట్టబెడుతున్నారు ప్రేక్షకులు. ప్రథమార్ధంలో చాలా వరకు క్రిష్ తీసిందే. ఆ సన్నివేశాలు నీట్గా అనిపించాయి. వాటిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం తక్కువే. ఉన్నా కూడా అవి నీట్గానే అనిపించాయి.
కానీ ద్వితీయార్ధం అంతా పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్.. బోరింగ్ సన్నివేశాలు.. కథను పక్కదారి పట్టించే సీన్లతో సినిమా గాడి తప్పింది. ద్వితీయార్ధం అంతా మార్చామని, జ్యోతికృష్ణ కొత్త సీన్లు రాసి డైరెక్ట్ చేశాడని స్వయంగా నిర్మాత రత్నమే వెల్లడించాడు. కాబట్టి సినిమాలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న సెకండాఫ్ విషయంలో క్రెడిట్ జ్యోతికృష్ణకే ఇవ్వాల్సి ఉంటుంది. క్రిష్ ఈ సినిమా తీసి ఉంటే ఔట్ పుట్ వేరుగా ఉండేదని.. అసలు వీఎఫెక్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉండేవాడు కాదని.. ధర్మ పరిరక్షణ ట్రాక్ అంతా తీసేసి.. ఢిల్లీకి వెళ్లి కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే టాస్క్ మీద కథను నడిపించి ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించేవాడని.. ప్రథమార్ధం లాగే ద్వితీయార్ధం కూడా రేసీగా సాగి సినిమా ప్రేక్షకులకు మంచి కిక్కిచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…