దర్శకులు తాను ఫలానా హీరోకు ఫ్యాన్ అని చెప్పడం మామూలే. ఐతే ఎక్కువగా తమ భాషకు చెందిన హీరోల గురించే ఇలా చెబుతుంటారు. కానీ తమిళంలో ఇప్పుడు టాప్ డైరెక్టర్లోలో ఒకడిగా ఉన్న లోకేష్ కనకరాజ్.. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడం విశేషమే. ఏదో మొక్కుబడిగా ఈ మాట అనలేదతను. నాగ్ ఫిల్మోగ్రఫీలో చాలా స్పెషల్ అయిన సినిమాల గురించి ప్రస్తావించి.. అవి తన మీద ఎంత ప్రభావం చూపాయో కూడా అతను వివరించాడు. నాగ్ ముందు ఒప్పుకోకున్నా.. ఆయన వెంటపడి మరీ అతను ‘కూలీ’లో విలన్ పాత్ర కోసం ఒప్పించిన సంగతి తెలిసిందే. నాగ్ మీద అభిమానంతోనే ఆయన్ని ఈ సినిమాలో నటింపజేసినట్లు అతను వెల్లడించాడు.
నాగ్ సినిమాల్లో అత్యంత హైప్ తెచ్చుకున్న ‘రక్షగన్’ (రక్షకుడు) తనకు ఆల్ టైం ఫేవరెట్ అని లోకేష్ వెల్లడించాడు. ఆ సినిమా టైంకి తాను స్కూల్లో ఉన్నానని.. ఆ సినిమాలో నాగ్ లుక్, యాటిట్యూడ్ తన మీద చాలా ఎఫెక్ట్ చూపించాయని.. కాలేజీ లైఫ్ అంతా తాను సేమ్ హేర్ స్టైల్ మెయింటైన్ చేశానని లోకేష్ తెలిపాడు. ఈ మధ్యే తాను జుట్టు తగ్గించినట్లు తెలిపాడు. ఇక నాగ్ నటించిన శివ, గీతాంజలి, అన్నమయ్య.. ఇలా చాలా సినిమాలు చూసి తాను ఫిదా అయిపోయానని.. ఆయన స్టైల్ తనకెంతో ఇష్టమని లోకేష్ తెలిపాడు.
‘కూలీ’ సినిమా కోసం నాగార్జునను ఒప్పించడం చాలా కష్టమైందని లోకేష్ చెప్పాడు. ముందు ఈ సినిమా చేయననే ఆయన అన్నారని.. కానీ ఆరేడుసార్లు ఆయన వెంటపడి.. మళ్లీ మళ్లీ తన క్యారెక్టర్ గురించి చెప్పి ఒప్పించానని లోకేష్ తెలిపాడు. ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పాక నాగ్.. సరే ట్రై చేద్దాం అని ఇందులో విలన్ పాత్రకు అంగీకరించినట్లు లోకేష్ తెలిపాడు. ‘కూలీ’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 26, 2025 12:38 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…