సినీ రంగంలో తొలి రోజుల్లో ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఆ తర్వాత ఒక స్థాయి అందుకున్నాక పాత రోజుల్లో ఎదురైన చేదు అనుభవాలను తర్వాత పంచుకోవడం మామూలే. ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు చాలానే ఉంటాయి. హీరోలతో సమానంగా ఇమేజ్ సంపాదించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న చాలామంది హీరోయిన్లు ఇలా పాత అనుభవాలను పంచుకున్న వాళ్లే. కంగనా రనౌత్ ఇలాంటి కథలు చాలానే చెప్పింది.
ఈ మధ్య తాప్సి పన్ను నుంచి కూడా ఇలాంటి కథలు చాలా వింటున్నాం. కెరీర్ ఆరంభంలో తాప్సి ఎక్కువగా గ్లామర్ పాత్రలు, అంతగా గుర్తింపు లేని రోల్సే చేసింది. అప్పుడు తన మీద గ్లామర్ తారగా ముద్ర వేసి ప్రతిభకు తగ్గ అవకాశాలివ్వకపోవడంపై, తనను చిన్న చూపు చూడటంపై ఇప్పటికే కొన్ని ఉదంతాలను ఆమె మీడియాతో పంచుకుంది.
తాజాగా మరికొన్ని ఆశ్చర్యకర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది తాప్సి. ఓ సినిమా నుంచి తనను హీరో భార్య తప్పించినట్లు తాప్సి తెలిపింది. తాను ఆ సినిమాలో కొనసాగడం హీరో భార్యకు నచ్చలేదని.. ఆమె బలవంతం మేరకు ఆ సినిమా మేకర్స్ తనను తీసేశారని ఆమె వెల్లడించింది. ఇక మరో సినిమాకు పని చేస్తుండగా.. తన వాయిస్ హీరోకు తాను చెప్పిన డైలాగ్ నచ్చలేదని, దాన్ని మార్చాలని చెప్పారని.. తాను అందుకు అంగీకరించకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్టును పిలిపించి వేరే డైలాగ్ చెప్పించారని ఆమె చెప్పుకొచ్చింది.
ఒక హీరో ముందు సినిమా సరిగా ఆడలేదని తన పారితోషకంలో కోత విధించిన సందర్భాలు కూడా ఉన్నాయని.. కెరీర్ ఆరంభంలో ఇలాంటి విచిత్ర అనుభవాలు ఎన్నో తాను ఎదుర్కొన్నానని తాప్సి గుర్తు చేసుకుంది. దక్షిణాదిన తనను గ్లామర్ తారగా ప్రొజెక్ట్ చేయడం, రాఘవేంద్రరావు ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో తన బొడ్డు మీద ఫోకస్ చేయడం గురించి తాప్సి ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 18, 2020 7:06 pm
ఫొటోల పిచ్చి అనండి.. ప్రచార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చేజేతులా చేసుకున్న వ్యవహారం ఇప్పుడు పీకల…
నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…
మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…