హరిహర వీరమల్లు విడుదల ముందు వరకు చాలా మందిలో ఉన్న సందేహం ఒక్కటే. ఇంత పెద్ద గ్రాండియర్ కు ఎంఎం కీరవాణి ఎంతవరకు న్యాయం చేయగలరని. ఆ అనుమానానికి తగ్గట్టే ఆడియో మరీ గొప్పగా చెప్పుకునే ఛార్ట్ బస్టర్ కాలేదు. సాంగ్స్ బాగున్నాయనే పేరొచ్చింది కానీ గ్రేట్ ఆల్బమ్ అవ్వలేదు. రెండు పాటలు జనాలకు ఫాస్ట్ గా రీచయ్యాయి. నిజానికి ఆస్కార్ విజేత మీద ఎలాంటి డౌట్స్ పెట్టుకోకూడదు. కానీ రాజమౌళికి తప్ప తన బెస్ట్ ని ఇతరులకు ఇవ్వడం లేదనే కామెంట్స్ కీరవాణి మీద కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. అందుకే హరిహర వీరమల్లు మీద డిస్కషన్ నడిచింది.
అవన్నీ సినిమా చూశాక పటాపంచలు అయ్యాయి. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కీరవాణి చాలా ఎపిసోడ్స్ ని నిలబెట్టేశారు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో ఫ్యాన్స్ దీన్ని బాగా ఆస్వాదించారు. సినిమా ఫలితం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడే చెప్పలేం కానీ తనవరకు పెద్దాయన న్యాయం చేకూర్చారు. విజువల్ గా చూశాక పాటలు కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఈవెంట్లలో పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం ఇచ్చిన ఎలివేషన్లకు తగ్గట్టుగానే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిచారు కీరవాణి. పవన్ కళ్యాణ్ తో తన మొదటి మూవీ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కాకుండా చూసుకున్నారు.
ఇప్పుడు నెక్స్ట్ మజిలీ విశ్వంభర కానుంది. కీరవాణికి అది ఇంకా పెద్ద బాధ్యత. ఎందుకంటే బడ్జెట్ పరంగా అది ఇంకా గ్రాండ్ స్కేల్ లో రూపొందింది. మెగాస్టార్ కు గతంలో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పి పరశురామ్ సినిమాలకు వర్క్ చేసిన కీరవాణి మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ చిరంజీవితో చేతులు కలిపారు. ఆల్రెడీ వచ్చిన రామనవమి పాట పర్వాలేదనిపించుకుంది. ఒక స్పెషల్ సాంగ్ ని భీమ్స్ తో చేయించుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి విశ్వంభర బీజీఎమ్ వైపు వెళ్లనుంది. దీనికి ఎలా ఇస్తారో చూడాలి. అసలైన ఛాలెంజ్ మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీతో ఎదురుకానుంది.
This post was last modified on July 24, 2025 5:05 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…