ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ముందు రోజు ప్రీమియర్లకు పర్మిషన్లు, జిఓలు వచ్చిన తర్వాత తెలంగాణలో ఇస్తారా లేదానే టెన్షన్ అభిమానులను వెంటాడింది. పుష్ప 2 సమయంలో సంధ్య థియేటర్ దుర్ఘటన ఇంకా మర్చిపోలేని నేపథ్యంలో అనుమతుల గురించి అనుమానాలు బలంగా ఉండేవి. ఆ టైంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఇకపై స్పెషల్ షోలు ఉండవనే రీతిలో సంకేతాలు ఇవ్వడం సినీ ప్రియులు గుర్తు చేసుకున్నారు. అయితే వాటిని పటాపంచలు చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి సర్కారు ధారాళంగా వరాలు కురిపించేసింది. కొద్దీ నిమిషాల క్రితమే జిఓ వచ్చింది. కొంచెం దగ్గరగా ఏపినే ఫాలో అయ్యారు.
జూలై 23 రాత్రి 9 తర్వాత వేసే బెనిఫిట్ షోల టికెట్ ధర ఫ్లాట్ 600 రూపాయలు ప్లస్ జిఎస్టిగా నిర్ణయించారు. జూలై 24 నుంచి 27 దాకా నాలుగు రోజుల పాటు రోజు 5 షోలు వేసుకోవచ్చు. మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ మీద 200 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 150 చొప్పున పెంచుకోవచ్చు. జూలై 28 నుంచి ఆగస్ట్ 2 వరకు మల్టీప్లెక్సుల్లో 150, సింగల్ స్క్రీన్లలో 106 రూపాయల దాకా ఒక్కో టికెట్ మీద అదనంగా ఛార్జ్ చేయొచ్చు. రిలీజ్ రోజు నుంచి ఉన్న ధరలు జిఎస్టి కలిపే ఉంటాయి. ఆగస్ట్ 3 నుంచి రెగ్యులర్ రేట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరమల్లుకి సూపర్ సపోర్ట్ దక్కేసింది.
ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చేసింది కాబట్టి ఇక నెక్స్ట్ మిగిలింది జూలై 23 అర్ధరాత్రి ఎలాంటి టాక్ రాబోతుందనేది. ఇంత రేట్లు పెట్టినప్పుడు కంటెంట్ కి న్యాయం జరిగితేనే నెగటివ్ టాక్ బయటికి రాదు. ఈ విషయంలో పుష్ప 2 విజయం సాధిస్తే గేమ్ ఛేంజర్ దెబ్బ తింది. నిర్మాత ఏఎం రత్నం టికెట్ కు ఎంత పెట్టినా బెస్ట్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. గత రెండు మూడు వారాలుగా సరైన సినిమా లేక థియేటర్లకు దూరంగా ఉన్న కామన్ ఆడియన్స్ ఇంత రేట్ పెట్టి వీరమల్లు చూస్తారా అనేది వేచి చూడాలి. కఠినంగా ఉంటుందనుకున్న తెలంగాణ గవర్నమెంట్ ఇంత సానుకూలంగా ఉండటం రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ కి గుడ్ న్యూసే.
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…