ఈ రోజుల్లో సినిమాలకు ప్రమోషన్లు అన్నవి ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. ఒకప్పుడు ప్రమోషన్లను పెద్దగా పట్టించుకోని స్టార్ హీరోలందరూ కూడా ఇప్పుడు కాలికి బలపం కట్టకుని తిరిగేస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు మీడియాకు ఇంటర్వ్యూలూ ఇస్తున్నారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లు ప్రమోషన్ల వల్ల కలిగే ప్రయోజనమేంటో చాటిచెప్పాక టాలీవుడ్ స్టార్లు కూడా వారిని అనుసరించడం మొదలుపెట్టారు.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమాలను ప్రమోట్ చేయడం తక్కువే. రాజకీయాల్లో బిజీ కావడానికి ముందు కూడా ఆయన మహా అయితే ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేవాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అరుదు. ఐతే తన కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం మాత్రం ఆయన టీంతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇదంతా కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే అని ఆయన స్పష్టం చేశారు. ఇక తాను సినిమాలకు సంబంధించి ఎందుకు మీడియాకు దూరంగా ఉంటానో పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
పవన్ హీరో అయిన కొత్తలో జ్యోతిచిత్ర, సితార లాంటి ఫిలిం మ్యాగజైన్లలో పవన్ ఫొటో వేసేవారు కాదట. ఇతను సేలబిలిటీ ఉన్న హీరో కాదు అని చెప్పి తన ఫొటోలను పక్కన పెట్టేసేవారని పవన్ వెల్లడించాడు. వాళ్లు అలా చేయడంతో తన ఫొటోలు వేయనపుడు వాళ్ల వెంట ఏం పడుతాం అని తాను మీడియాకు దూరం అయిపోయినట్లు పవన్ వెల్లడించాడు. ఇక మీడియాను కలిసినపుడు సినిమా గురించి ఏం చెప్పాలి అనే విషయంలో కూడా తనకు డైలమా ఉంటుందన్నాడు పవన్.
కథ ఎంత వరకు చెప్పాలి.. ఏం మాట్లాడాలి అన్నది ఎప్పుడూ అయోమయమే అని.. ఒకవేళ సినిమా అద్భుతంగా ఉంటుంది అని చెబితే.. రేప్పొద్దున అలా లేకుంటే తిడతారేమో అని కూడా భయం అని పవన్ చెప్పాడు. ఇదే ప్రసంగంలో తాను టాలీవుడ్లో చాలామంది హీరోల కంటే తక్కువ అని.. వాళ్ల సినిమాలకు జరిగినంత బిజినెస్ తన చిత్రాలకు జరగదని పవన్ తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడ్డం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రసంగంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on July 21, 2025 5:41 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…