ఈ రోజుల్లో సినిమాలకు ప్రమోషన్లు అన్నవి ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. ఒకప్పుడు ప్రమోషన్లను పెద్దగా పట్టించుకోని స్టార్ హీరోలందరూ కూడా ఇప్పుడు కాలికి బలపం కట్టకుని తిరిగేస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు మీడియాకు ఇంటర్వ్యూలూ ఇస్తున్నారు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లు ప్రమోషన్ల వల్ల కలిగే ప్రయోజనమేంటో చాటిచెప్పాక టాలీవుడ్ స్టార్లు కూడా వారిని అనుసరించడం మొదలుపెట్టారు.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తన సినిమాలను ప్రమోట్ చేయడం తక్కువే. రాజకీయాల్లో బిజీ కావడానికి ముందు కూడా ఆయన మహా అయితే ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేవాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అరుదు. ఐతే తన కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం మాత్రం ఆయన టీంతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇదంతా కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే అని ఆయన స్పష్టం చేశారు. ఇక తాను సినిమాలకు సంబంధించి ఎందుకు మీడియాకు దూరంగా ఉంటానో పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
పవన్ హీరో అయిన కొత్తలో జ్యోతిచిత్ర, సితార లాంటి ఫిలిం మ్యాగజైన్లలో పవన్ ఫొటో వేసేవారు కాదట. ఇతను సేలబిలిటీ ఉన్న హీరో కాదు అని చెప్పి తన ఫొటోలను పక్కన పెట్టేసేవారని పవన్ వెల్లడించాడు. వాళ్లు అలా చేయడంతో తన ఫొటోలు వేయనపుడు వాళ్ల వెంట ఏం పడుతాం అని తాను మీడియాకు దూరం అయిపోయినట్లు పవన్ వెల్లడించాడు. ఇక మీడియాను కలిసినపుడు సినిమా గురించి ఏం చెప్పాలి అనే విషయంలో కూడా తనకు డైలమా ఉంటుందన్నాడు పవన్.
కథ ఎంత వరకు చెప్పాలి.. ఏం మాట్లాడాలి అన్నది ఎప్పుడూ అయోమయమే అని.. ఒకవేళ సినిమా అద్భుతంగా ఉంటుంది అని చెబితే.. రేప్పొద్దున అలా లేకుంటే తిడతారేమో అని కూడా భయం అని పవన్ చెప్పాడు. ఇదే ప్రసంగంలో తాను టాలీవుడ్లో చాలామంది హీరోల కంటే తక్కువ అని.. వాళ్ల సినిమాలకు జరిగినంత బిజినెస్ తన చిత్రాలకు జరగదని పవన్ తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడ్డం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రసంగంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on July 21, 2025 5:41 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…