టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ సంస్థను నడిపించే సూర్యదేవర నాగవంశీ.. ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒకరు. అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం.. ఇప్పుడు నాగవంశీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పాడంటే తనెంత సక్సెస్ ఫుల్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఐతే అలాంటి నిర్మాత కూడా బాక్సాఫీస్ ఫలితాలను సరిగా అంచనా వేయలేకపోతున్నాడట. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో.. దేన్ని తిరస్కరిస్తారో తనకు అర్థం కావడం లేదని ఆయనన్నారు. తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలతో పాటు వేరే చిత్రాల ఫలితాలు కూడా తనను ఆశ్చర్యపరుస్తున్నట్లు చెప్పారు. తనకు అలా షాకిచ్చిన మూడు సినిమాల ఫలితాల గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
గత ఏడాది తమ ప్రొడక్షన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన పట్ల నాగవంశీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తొలి రెండు రోజులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని.. కానీ అందులో ట్రోల్ చేయాల్సిన కంటెంట్ ఏముందో తనకు అర్థం కాలేదని నాగవంశీ తెలిపారు. కానీ అదే సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే గొప్ప ఆదరణ దక్కించుకుందని.. ‘గుంటూరు కారం’ బాగా లేదని ఒక్కరూ అనలేదని.. అలాంటపుడు ముందు ఎందుకు ట్రోల్ చేశారని నాగవంశీ ప్రశ్నించాడు.
ఇక గత ఏడాది తాను ప్రొడ్యూస్ చేసిన ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధిస్తుందని అనుకున్నానని.. సినిమా చాలా బాగుందని అందరూ అన్నా సరే దానికి ఆశించిన రెవెన్యూ రాకపోవడం తనకు ఇంకా పెద్ద పజిల్ అని నాగవంశీ తెలిపాడు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘కుబేర’ గురించి కూడా నాగవంశీ మాట్లాడాడు. ఈ సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలా అనిపించిందని.. కానీ అక్కడ ఆడని ఈ సినిమా తెలుగులో మాత్రం పెద్ద హిట్టయిందని.. ఇది కూడా తనకు షాకే అని నాగవంశీ తెలిపాడు. మనకు అంతా తెలుసు అనుకోవడం తప్పు అని, ప్రేక్షకుల నాడిని ఎవరూ పసిగట్టలేరని నాగవంశీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
This post was last modified on July 19, 2025 3:18 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…