టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ సంస్థను నడిపించే సూర్యదేవర నాగవంశీ.. ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒకరు. అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం.. ఇప్పుడు నాగవంశీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పాడంటే తనెంత సక్సెస్ ఫుల్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఐతే అలాంటి నిర్మాత కూడా బాక్సాఫీస్ ఫలితాలను సరిగా అంచనా వేయలేకపోతున్నాడట. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో.. దేన్ని తిరస్కరిస్తారో తనకు అర్థం కావడం లేదని ఆయనన్నారు. తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలతో పాటు వేరే చిత్రాల ఫలితాలు కూడా తనను ఆశ్చర్యపరుస్తున్నట్లు చెప్పారు. తనకు అలా షాకిచ్చిన మూడు సినిమాల ఫలితాల గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
గత ఏడాది తమ ప్రొడక్షన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన పట్ల నాగవంశీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తొలి రెండు రోజులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని.. కానీ అందులో ట్రోల్ చేయాల్సిన కంటెంట్ ఏముందో తనకు అర్థం కాలేదని నాగవంశీ తెలిపారు. కానీ అదే సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే గొప్ప ఆదరణ దక్కించుకుందని.. ‘గుంటూరు కారం’ బాగా లేదని ఒక్కరూ అనలేదని.. అలాంటపుడు ముందు ఎందుకు ట్రోల్ చేశారని నాగవంశీ ప్రశ్నించాడు.
ఇక గత ఏడాది తాను ప్రొడ్యూస్ చేసిన ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధిస్తుందని అనుకున్నానని.. సినిమా చాలా బాగుందని అందరూ అన్నా సరే దానికి ఆశించిన రెవెన్యూ రాకపోవడం తనకు ఇంకా పెద్ద పజిల్ అని నాగవంశీ తెలిపాడు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘కుబేర’ గురించి కూడా నాగవంశీ మాట్లాడాడు. ఈ సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలా అనిపించిందని.. కానీ అక్కడ ఆడని ఈ సినిమా తెలుగులో మాత్రం పెద్ద హిట్టయిందని.. ఇది కూడా తనకు షాకే అని నాగవంశీ తెలిపాడు. మనకు అంతా తెలుసు అనుకోవడం తప్పు అని, ప్రేక్షకుల నాడిని ఎవరూ పసిగట్టలేరని నాగవంశీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…