టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ సంస్థను నడిపించే సూర్యదేవర నాగవంశీ.. ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒకరు. అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం.. ఇప్పుడు నాగవంశీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పాడంటే తనెంత సక్సెస్ ఫుల్ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఐతే అలాంటి నిర్మాత కూడా బాక్సాఫీస్ ఫలితాలను సరిగా అంచనా వేయలేకపోతున్నాడట. ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో.. దేన్ని తిరస్కరిస్తారో తనకు అర్థం కావడం లేదని ఆయనన్నారు. తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలతో పాటు వేరే చిత్రాల ఫలితాలు కూడా తనను ఆశ్చర్యపరుస్తున్నట్లు చెప్పారు. తనకు అలా షాకిచ్చిన మూడు సినిమాల ఫలితాల గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
గత ఏడాది తమ ప్రొడక్షన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన పట్ల నాగవంశీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమాను తొలి రెండు రోజులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారని.. కానీ అందులో ట్రోల్ చేయాల్సిన కంటెంట్ ఏముందో తనకు అర్థం కాలేదని నాగవంశీ తెలిపారు. కానీ అదే సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే గొప్ప ఆదరణ దక్కించుకుందని.. ‘గుంటూరు కారం’ బాగా లేదని ఒక్కరూ అనలేదని.. అలాంటపుడు ముందు ఎందుకు ట్రోల్ చేశారని నాగవంశీ ప్రశ్నించాడు.
ఇక గత ఏడాది తాను ప్రొడ్యూస్ చేసిన ‘లక్కీ భాస్కర్’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధిస్తుందని అనుకున్నానని.. సినిమా చాలా బాగుందని అందరూ అన్నా సరే దానికి ఆశించిన రెవెన్యూ రాకపోవడం తనకు ఇంకా పెద్ద పజిల్ అని నాగవంశీ తెలిపాడు. ఇక టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘కుబేర’ గురించి కూడా నాగవంశీ మాట్లాడాడు. ఈ సినిమా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాలా అనిపించిందని.. కానీ అక్కడ ఆడని ఈ సినిమా తెలుగులో మాత్రం పెద్ద హిట్టయిందని.. ఇది కూడా తనకు షాకే అని నాగవంశీ తెలిపాడు. మనకు అంతా తెలుసు అనుకోవడం తప్పు అని, ప్రేక్షకుల నాడిని ఎవరూ పసిగట్టలేరని నాగవంశీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
This post was last modified on July 19, 2025 3:18 pm
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…