ఓ పెద్ద సినిమా మొదలైందంటే.. విడుదల ముందు వరకు దాని కథాంశం బయటికి రాకుండా చూసుకుంటారు. ట్రైలర్లో కూడా అందరూ కథను చెప్పరు. తెర మీద ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని భావిస్తారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ముందే కథేంటో రివీల్ చేసేస్తుంటారు. గతంలో రాజమౌళి చాలా సినిమాలకు ఇదే శైలిని అనుసరించారు. ఇప్పుడు ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ కూడా జక్కన్న బాటలో పయనించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా బేసిక్ కథేంటో అతను బయట పెట్టేశాడు.
ఇప్పటిదాకా సినిమాల్లో భూలోకం, స్వర్గ లోకం.. యమలోకం.. అంటూ ఏడు లోకాలను చూపించారని.. కానీ తాము ‘విశ్వంభర’లో మొత్తం 14 లోకాలను చూపించబోతున్నామని వశిష్ఠ వెల్లడంచాడు. ఈ 14 లోకాల్లో 7 కింద ఉంటే.. 7 పైన ఉంటాయని.. ఇప్పటిదాకా సినిమాల్లో వివిధ లోకాలను ఎవరికి తోచినట్లు వాళ్లు చూపించారని.. తాము ఈ 14 లోకాలతో పాటు వాటికి మూలమైన సత్య లోకాన్ని చూపించబోతున్నామని వశిష్ఠ వెల్లడించాడు. ఇలా లోకాల చుట్టూ తిరిగే కథల్లో హీరో.. హీరోయిన్ లేదా ఇంకో ఎలిమెంట్ను తిరిగి తెచ్చుకోవడానికి వేరే లోకంతో పోరాటం చేస్తాడని.. ‘విశ్వంభర’ కూడా అదే శైలిలో నడుస్తుందని వశిష్ఠ తెలిపాడు.
చిరు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ఫాంటసీ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి, ‘విశ్వంభర’కు ఏ పోలికా లేదని వశిష్ఠ తెలిపాడు. ‘భైరవద్వీపం’తో కూడా దీనికి సంబంధం లేదని అతను చెప్పాడు. ‘కీలుగుర్రం’ సినిమా తమ చిత్రానికి స్ఫూర్తి అని అతను తెలిపాడు. ఇంకా పాతాళభైరవి లాంటి సినిమాల నుంచి కూడా ఇన్స్పైర్ అయినట్లు అతను వెల్లడించాడు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని.. సెట్స్ అనే ఫీలింగ్ కలగకుండా వివిధ లోకాలను చూపించామని వశిష్ఠ తెలిపాడు.
This post was last modified on July 18, 2025 3:16 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…