రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో జూనియర్ మీద పబ్లిక్ లో పెద్దగా బజ్ లేదు. నిర్మాణం జరుపుకుని నెలలు గడిచినప్పటికీ ఫైనల్ గా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ప్రముఖ మైనింగ్ వ్యాపారవేత్త, ప్రజా ప్రతినిధి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా పరిచయమవుతున్న ఈ మూవీకి ప్రధాన ఆకర్షణలు చాలా ఉన్నాయి. హీరోయిన్ శ్రీలీల వైరల్ వయ్యారి డాన్స్ ఆల్రెడీ వైరలయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ పాట ఒకటి క్లిక్ అయితే ఆటోమేటిక్ గా ఆ చిత్రం మీద బజ్ రావడం గతంలో చాలాసార్లు చూశాం. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల జనాల దృష్టిలో జూనియర్ పడ్డట్టు అయ్యింది.
రాజమౌళి అతిథిగా రావడం, చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చి వేడుకకు హాజరు కావడం, శ్రీలీల గ్లామర్ ప్లస్ స్పీచ్, దేవి హుషారైన ప్రసంగం, ఇతర సాంకేతిక నిపుణుల ఎలివేషన్లు మొత్తంగా ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో బాగానే తిరుగుతున్నాయి. బాగా డౌన్ టు ఎర్త్ లా కనిపిస్తున్న కిరిటీ ఆశలన్నీ తన మాతృబాష కన్నడ కంటే తెలుగు మార్కెట్ మీదే ఎక్కువగా ఉన్నాయి. క్లిక్ అయితే ఇక్కడ ఏ స్థాయిలో ఆఫర్లు వస్తాయో అవగాహన ఉన్నట్టుంది. పైగా దేవీశ్రీప్రసాద్ ఏకంగా అల్లు అర్జున్ ఆర్యతో జూనియర్ ని పోల్చడం చూస్తుంటే కంటెంట్ ఏదో సాలిడ్ గానే ఉందని చెప్పాలి.
రేపు టాక్ కొంచెం డీసెంట్ గా వచ్చినా వీకెండ్ లో మంచి నెంబర్లు చూడొచ్చు. లేదూ హిట్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేసుకోవచ్చు. ఎటొచ్చి వచ్చే వారం హరిహర వీరమల్లు ఉన్న నేపథ్యంలో ఏం చేసినా ఏడు రోజుల్లో జరిగిపోవాలి. కొంత కాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్న వారాహి చలన చిత్రం సాయి కొర్రపాటి నిర్మించడం వల్లే రాజమౌళి ఈ ఈవెంట్ కి వచ్చారనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు అందరి చూపు రేపు రాబోయే రిపోర్ట్స్ మీదే ఉన్నాయి. పెద్దగా పోటీ లేకపోవడంతో జూనియర్ కు బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ దొరికింది. దాన్ని సరిగ్గా వాడుకుంటే మాత్రం కిరీటి టాలీవుడ్ తొలి అడుగు విజయవంతంగా పడుతుంది.
This post was last modified on July 17, 2025 3:18 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…