అసలే థియేటర్, ఓటిటి మధ్య నెల రోజుల గ్యాప్ కూడా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తోందని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మొత్తుకుంటూ ఉంటే ఇంకా విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు రిలీజవుతున్న కొత్త సినిమాల్లో తమిళ మూవీ డిఎన్ఏ ఉంది. తెలుగులో మై బేబీ పేరుతో డబ్బింగ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ జూన్ 20 విడుదలై మంచి స్పందనే దక్కించుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించాడు. గద్దలకొండ గణేష్ తో మనకు పరిచయమైన అధర్వ మురళి హీరో కాగా అయిదుగురు సంగీత దర్శకులు పాటలు, గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
అంత బాగానే ఉంది కానీ కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో ఈ సినిమా హాట్ స్టార్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. అంటే జూలై 18 తెలుగు థియేట్రికల్ రిలీజ్ కాగా జూలై 19 నుంచి అయిదు భాషల్లో ఓటిటిలో చూసేయొచ్చు. ఈ లెక్కన మొదటి ఆట పడిన ఇరవై నాలుగు గంటలోపే డిజిటల్ లో చూసేయొచ్చన్న మాట. ఒప్పందం ప్రకారం నెల రోజుల స్ట్రీమింగ్ కాబట్టి తమిళ వెర్షన్ యథావిధిగా టైం ప్రకారమే వచ్చేస్తోంది కానీ ఎటొచ్చి డబ్బింగ్ హక్కులు కొన్న ఇక్కడి ప్రొడ్యూసర్లే బాగా ఆలస్యం చేశారు. ఆ మధ్య త్రిష ఐడెంటిటీ, శివరాజ్ కుమార్ వేదా కూడా ఇలాగే గంటల వ్యవధిలో ఓటిటికి వచ్చి దెబ్బ తిన్నాయి.
ఇకపై ఇలాంటి విషయాల్లో నిర్మాతలు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే ప్రేక్షకులు బాగా అడ్వాన్స్ అయిపోయారు. ప్రతి వారం కొత్త ఓటిటి కంటెంట్ ఏమొస్తుందో ముందే చూసుకుంటున్నారు. దాని వల్ల థియేటర్ కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాలు మారుతున్నాయి. అసలే బజ్ లేని సినిమాలకు మొదటి రోజే షోలు క్యాన్సిల్ అవుతున్న దాఖలాలు ప్రతి శుక్రవారం కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటిది ఒక డబ్బింగ్ మూవీకి ఇలా జరగడం ఎలాంటి ఫలితం ఇస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. రేపు అయిదారు రిలీజులు ఉన్న నేపథ్యంలో ఇంత కాంపిటీషన్ లో మై బేబీ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…