అసలే థియేటర్, ఓటిటి మధ్య నెల రోజుల గ్యాప్ కూడా వసూళ్ల మీద ప్రభావం చూపిస్తోందని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మొత్తుకుంటూ ఉంటే ఇంకా విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు రిలీజవుతున్న కొత్త సినిమాల్లో తమిళ మూవీ డిఎన్ఏ ఉంది. తెలుగులో మై బేబీ పేరుతో డబ్బింగ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ జూన్ 20 విడుదలై మంచి స్పందనే దక్కించుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించాడు. గద్దలకొండ గణేష్ తో మనకు పరిచయమైన అధర్వ మురళి హీరో కాగా అయిదుగురు సంగీత దర్శకులు పాటలు, గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
అంత బాగానే ఉంది కానీ కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో ఈ సినిమా హాట్ స్టార్ ఓటిటిలోకి వచ్చేస్తుంది. అంటే జూలై 18 తెలుగు థియేట్రికల్ రిలీజ్ కాగా జూలై 19 నుంచి అయిదు భాషల్లో ఓటిటిలో చూసేయొచ్చు. ఈ లెక్కన మొదటి ఆట పడిన ఇరవై నాలుగు గంటలోపే డిజిటల్ లో చూసేయొచ్చన్న మాట. ఒప్పందం ప్రకారం నెల రోజుల స్ట్రీమింగ్ కాబట్టి తమిళ వెర్షన్ యథావిధిగా టైం ప్రకారమే వచ్చేస్తోంది కానీ ఎటొచ్చి డబ్బింగ్ హక్కులు కొన్న ఇక్కడి ప్రొడ్యూసర్లే బాగా ఆలస్యం చేశారు. ఆ మధ్య త్రిష ఐడెంటిటీ, శివరాజ్ కుమార్ వేదా కూడా ఇలాగే గంటల వ్యవధిలో ఓటిటికి వచ్చి దెబ్బ తిన్నాయి.
ఇకపై ఇలాంటి విషయాల్లో నిర్మాతలు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే ప్రేక్షకులు బాగా అడ్వాన్స్ అయిపోయారు. ప్రతి వారం కొత్త ఓటిటి కంటెంట్ ఏమొస్తుందో ముందే చూసుకుంటున్నారు. దాని వల్ల థియేటర్ కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాలు మారుతున్నాయి. అసలే బజ్ లేని సినిమాలకు మొదటి రోజే షోలు క్యాన్సిల్ అవుతున్న దాఖలాలు ప్రతి శుక్రవారం కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటిది ఒక డబ్బింగ్ మూవీకి ఇలా జరగడం ఎలాంటి ఫలితం ఇస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. రేపు అయిదారు రిలీజులు ఉన్న నేపథ్యంలో ఇంత కాంపిటీషన్ లో మై బేబీ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.
This post was last modified on July 17, 2025 1:08 pm
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…