హరిహర వీరమల్లు విడుదలవుతున్న వేళ మొదట దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన దర్శకుడు క్రిష్ ఇప్పుడు ప్రమోషన్ల టైంలో బయటికి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి చేసింది జ్యోతి కృష్ణే అయినప్పటికీ క్రిష్ కాంట్రిబ్యూషన్ ని తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మీద ఆయన మూడు సంవత్సరాలు పని చేశారు. స్క్రిప్ట్ స్టేజి నుంచి దానికో రూపం వచ్చే దాకా సర్వం చూసుకున్నారు. ప్రాధమిక అవగహన క్రిష్ కే ఎక్కువ ఉంటుంది. కానీ రిలీజ్ ఇంకో ఎనిమిది రోజులు ఉండగా తను ఎక్కడ కనిపించకపోవడం అభిమానులు కొంత లోటుగానే ఫీలవుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన కొన్ని కోణాలున్నాయి. క్రిష్ ఇప్పుడు ఇంటర్వ్యూలు గట్రా ఇస్తే ఏదో ఒక రూపంలో హైలైట్ అవుతాడు. అదే జరిగితే జ్యోతి కృష్ణ పడ్డ కష్టం సైడ్ ట్రాక్ అయ్యే రిస్క్ లేకపోలేదు. నిర్మాతగా కన్నా ఒక తండ్రిగా ఏఎం రత్నం దాన్ని కోరుకోరు. పైగా క్రిష్ ఎందుకు వెళ్లారనే దాని మీద ఆయన పలు ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు జ్యోతికృష్ణ సైతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో క్రిష్ ప్రస్తావన తెచ్చి తనకు మంచి పునాది వేసి ఇచ్చారని కృతజ్ఞతలు చెప్పాడు. సో అక్కడితో కథ ముగిసింది. క్రిష్ రావడం జరిగే పనిలా లేదు. ఒకవేళ వస్తే మాత్రం స్వీట్ సర్ప్రైజ్.
ఇది పక్కనపెడితే క్రిష్ మీద బండెడు బరువు మరొకటి ఉంది. అనుష్క ఘాటీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. పైగా ఈ ఏడాది స్లాట్లన్నీ ప్యాన్ ఇండియా మూవీస్ దాదాపు తీసేసుకున్నాయి. వీలైనంత త్వరగా ఘాటీకి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయకపోతే ఓటిటి నుంచి ఒత్తిడి వస్తుంది. ఇదంతా క్రిష్ దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో బయటికి వచ్చి హరిహర వీరమల్లు గురించి కబుర్లు చెప్పే మూడ్, తీరికా రెండు ఉండకపోవచ్చు. వచ్చినా రాకపోయినా క్రిష్ కష్టాన్ని ఫ్యాన్స్ మరీ తేలిగ్గా మర్చిపోరు.
This post was last modified on July 15, 2025 9:53 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…