హరిహర వీరమల్లు విడుదలవుతున్న వేళ మొదట దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన దర్శకుడు క్రిష్ ఇప్పుడు ప్రమోషన్ల టైంలో బయటికి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి చేసింది జ్యోతి కృష్ణే అయినప్పటికీ క్రిష్ కాంట్రిబ్యూషన్ ని తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మీద ఆయన మూడు సంవత్సరాలు పని చేశారు. స్క్రిప్ట్ స్టేజి నుంచి దానికో రూపం వచ్చే దాకా సర్వం చూసుకున్నారు. ప్రాధమిక అవగహన క్రిష్ కే ఎక్కువ ఉంటుంది. కానీ రిలీజ్ ఇంకో ఎనిమిది రోజులు ఉండగా తను ఎక్కడ కనిపించకపోవడం అభిమానులు కొంత లోటుగానే ఫీలవుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన కొన్ని కోణాలున్నాయి. క్రిష్ ఇప్పుడు ఇంటర్వ్యూలు గట్రా ఇస్తే ఏదో ఒక రూపంలో హైలైట్ అవుతాడు. అదే జరిగితే జ్యోతి కృష్ణ పడ్డ కష్టం సైడ్ ట్రాక్ అయ్యే రిస్క్ లేకపోలేదు. నిర్మాతగా కన్నా ఒక తండ్రిగా ఏఎం రత్నం దాన్ని కోరుకోరు. పైగా క్రిష్ ఎందుకు వెళ్లారనే దాని మీద ఆయన పలు ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు జ్యోతికృష్ణ సైతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్ లో క్రిష్ ప్రస్తావన తెచ్చి తనకు మంచి పునాది వేసి ఇచ్చారని కృతజ్ఞతలు చెప్పాడు. సో అక్కడితో కథ ముగిసింది. క్రిష్ రావడం జరిగే పనిలా లేదు. ఒకవేళ వస్తే మాత్రం స్వీట్ సర్ప్రైజ్.
ఇది పక్కనపెడితే క్రిష్ మీద బండెడు బరువు మరొకటి ఉంది. అనుష్క ఘాటీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. పైగా ఈ ఏడాది స్లాట్లన్నీ ప్యాన్ ఇండియా మూవీస్ దాదాపు తీసేసుకున్నాయి. వీలైనంత త్వరగా ఘాటీకి ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయకపోతే ఓటిటి నుంచి ఒత్తిడి వస్తుంది. ఇదంతా క్రిష్ దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టైంలో బయటికి వచ్చి హరిహర వీరమల్లు గురించి కబుర్లు చెప్పే మూడ్, తీరికా రెండు ఉండకపోవచ్చు. వచ్చినా రాకపోయినా క్రిష్ కష్టాన్ని ఫ్యాన్స్ మరీ తేలిగ్గా మర్చిపోరు.
తమ భాషను, తమ సంస్కృతిని, తమ సామిత్యాన్ని గౌరవించుకోవడంలో మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లది ఎప్పుడూ వెనుకబాటే అన్న…
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…