పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్, సింగల్ స్క్రీన్ ఏదైనా సరే గరిష్ట టికెట్ ధర 200 రూపాయలు లోపే ఉండాలని జిఓ జారీ చేయడం ఎగ్జిబిషన్ వర్గాలకు పెద్ద షాకిచ్చింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ఫ్లెక్సీ ప్రైసింగ్ ని వాడుకుని అక్కడున్న థియేటర్లు ముఖ్యంగా బెంగళూరు మల్టీప్లెక్సులు ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచేసేవి. దీని వల్ల సామాన్యులు హాలీవుడ్ సినిమాలు త్వరగా చూసే పరిస్థితి లేకపోయింది. దిగువన ఉన్న బిసి సెంటర్స్ లో ఈ సమస్య లేకపోయినా హుబ్లీ, ధార్వాడ్, బెళగావి లాంటి నగరాల్లో బిగ్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ సామాన్యులకు భారంగా మారింది.
ఇప్పుడీ చర్య పట్ల మల్టీప్లెక్సుల సంఘం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు శాండల్ వుడ్ టాక్. ఎందుకంటే బెంగళూరులో చాలా ప్రీమియర్ స్క్రీన్లు ఉన్నాయి. త్వరలో మహేష్ బాబు కూడా భారీ సముదాయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం 200 రూపాయలకే టికెట్లు అమ్మాలంటే వర్కవుట్ కావడం కష్టం. కానీ సగటు ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అవుతుంది. కాకపోతే బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. టికెట్లను బ్లాక్ చేసి యాజమాన్యాలు వాటిని బయట ఎక్కువ రేట్లకు అమ్ముకునే ఛాన్స్ లేకపోలేదు. వాటిని కట్టడి చేయడానికి పోలీస్ వ్యవస్థ రంగంలోకి దిగాలి.
చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు ఇబ్బంది లేదు కానీ ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ పరిణామం చాలా ఇబ్బంది. ఎందుకంటే కన్నడ కంటే తమిళ, తెలుగు చిత్రాలు కర్ణాటకలో బాగా ఆడతాయి. నాటి చిరంజీవి కాలం నుంచి ఇప్పటి మహేష్ బాబు దాకా ప్రతిఒక్కరికి అక్కడ బలమైన మార్కెట్ ఉంది. పుష్ప 2 ది రూల్ రికార్డులు బద్దలు కొట్టింది. లియో సెన్సేషనల్ వసూళ్లు అందుకుంది. అవన్నీ అంత సులభంగా ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. ఇది కొంచెం ఎక్కువగానే మన బిజినెస్ మీద ప్రభావం చూపించేలా ఉంది. అక్కడేమో కానీ ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి మోడల్ వస్తే అంతే సంగతులు.
This post was last modified on July 15, 2025 9:49 pm
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…