ఇంకో తొమ్మిది రోజులు గడిస్తే పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చేస్తారు. హరిహర వీరమల్లు రాకకు రంగం సిద్ధమవుతోంది. బిజినెస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇంకా పూర్తి కావాల్సిన థియేటర్ అగ్రిమెంట్లు చాలానే ఉన్నాయట. నిర్మాత ఏఎం రత్నం వీటిలో తల మునకలై ఉన్నారు. క్లియర్ చేయాల్సిన ఫైనాన్సులను తగ్గించుకోవాలంటే అడ్వాన్సులు రావాలి. కానీ కోరుకున్నంత మొత్తం వేగంగా రాకపోవడమే సమస్య. ఎంత పవన్ సినిమా అయినా బజ్ పరంగా హరిహర వీరమల్లు ఓజి స్థాయిలో లేదన్నది వాస్తవం. ఓజి కోసం ఎగబడుతున్న బయ్యర్లు వీరమల్లు మీద అంతే స్థాయిలో ఆసక్తి చూపించడం లేదన్నది బహిరంగ రహస్యం.
ఇప్పుడు వీరమల్లు బృందం ముందున్న తక్షణ కర్తవ్యాలు కొన్నున్నాయి. చివరి నిమిషం దాకా ఆర్థిక ఒత్తిళ్లు రాకుండా చూసుకోవడం. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు, రోజువారీ షోలు, స్క్రీన్ల పంపకాలు లాంటి పంచాయితీలు తలనెప్పిగా మారకూడదంటే కనీసం రెండు రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోవాలి. ఈ మధ్య టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఏపీ జిఓలు కొంత ఆలస్యంగా వస్తున్నాయి. దాని వల్ల ఆన్ లైన్ టికెట్ అమ్మకాలు రిలీజ్ కు కొన్ని గంటల ముందు మాత్రమే మొదలుపెట్టే పరిస్థితి తలెత్తింది. వీరమల్లు ఓపెనింగ్స్ లో పెద్ద నెంబర్లు రావాలంటే లేట్ బుకింగ్స్ లేకుండా చూసుకోవాలి.
సెన్సార్ టాక్ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో తక్కువ టైంలోనే ఎక్కువ పబ్లిసిటీ జరిగేలా చూసుకోవాలి. ఈ నెల 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంటనే టాక్ వచ్చింది కానీ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజమౌళి, త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా కన్ఫర్మ్ అయినట్టే. ఇంకెవరు వస్తున్నారో పేర్లు తెలియాల్సి ఉంది. పవన్ ఉంటే ప్రత్యేకంగా ఇంకే స్టార్ హీరోలు అవసరం లేదు కాబట్టి వేరే హీరోలు రాకపోవచ్చు. హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఇందులో పాల్గొనబోతోంది. థియేటర్ బిజినెస్ ఎంతకు క్లోజ్ చేశారనే వివరాలు రేపో ఎల్లుండో తెలియనున్నాయి.
This post was last modified on July 15, 2025 3:28 pm
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…
ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…