కేవలం పది అంటే పదే రోజుల్లో హరిహర వీరమల్లు విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక చేసిన సినిమా కావడంతో అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. అయితే సాధారణ ప్రేక్షకుల్లో అంత బజ్ ఉందా అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ థియేటర్ బిజినెస్ కు సంబంధించి క్లియర్ పిక్చర్ రావడం లేదు. ఫలానా డిస్ట్రిబ్యూటర్ ఫలానా ఏరియాలు కొన్నారనే లీకులు సోషల్ మీడియాలో వస్తున్నాయి తప్పించి ఫైనల్ గా ఎంత నెంబర్స్ దగ్గర క్లోజ్ అయ్యాయనేది బయటికి రావడం లేదు. నిర్మాత ఏఎం రత్నంకు రావాల్సిన అడ్వాన్సులు చాలానే ఉన్నాయట.
అవి పూర్తిగా చేతికి అందితే ఫైనాన్సులు కట్టడానికి దారి దొరుకుతుంది. ఇదిలా ఉంచితే హిందీ వెర్షన్ కు సంబంధించి ప్రమోషన్ పెద్దగా చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హైందవ ధర్మం పరిరక్షణ కోసం పోరాడిన వీరమల్లు కథ ఉత్తరాది ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని, అంత కంటెంట్ ఇందులో ఉందని తెలిసేలా పబ్లిసిటీ చేస్తేనే జనాలు వస్తారని ఆశిస్తున్నారు. కార్తికేయ 2, కాంతార తరహాలో దీన్ని చూస్తారని గుడ్డి నమ్మకం పెట్టుకోవడం సరికాదు. ఎలాంటి అంచనాలు లేకుండా సర్ప్రైజ్ ఇచ్చిన ప్యాకేజీలవి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ముందు గానే ఏవేవో లెక్కలతో పబ్లిక్ వస్తారు.
టాక్ ఖచ్చితంగా అదిరిపోతుందనే నమ్మకంతో రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణలు ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ మొత్తం స్ట్రాంగ్ రన్ రావాలంటే ప్రమోషన్ల గేరు మార్చాలి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రామిసింగ్ గానే ఉన్నాయి. నార్త్ లో ఆ స్థాయి స్పందన కనిపించాలి. ఎలాగూ హిందీలో ఈ నెలలో చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు. సో సరిగా వాడుకుంటే భారీ కలెక్షన్లు రాబట్టవచ్చు. ముంబైలో ఒక ఈవెంట్ ఉందని, దానికి యోగి ఆదిత్యనాధ్ లాంటి ఎందరో బిజెపి సిఎంలు, ప్రముఖులు వస్తారనే ప్రచారం జరిగింది కానీ ఎంతవరకు నిజమవుతుందో, అసలీ పది రోజుల్లో సాధ్యమవుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 14, 2025 12:44 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…