కేవలం పది అంటే పదే రోజుల్లో హరిహర వీరమల్లు విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎం అయ్యాక చేసిన సినిమా కావడంతో అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. అయితే సాధారణ ప్రేక్షకుల్లో అంత బజ్ ఉందా అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ థియేటర్ బిజినెస్ కు సంబంధించి క్లియర్ పిక్చర్ రావడం లేదు. ఫలానా డిస్ట్రిబ్యూటర్ ఫలానా ఏరియాలు కొన్నారనే లీకులు సోషల్ మీడియాలో వస్తున్నాయి తప్పించి ఫైనల్ గా ఎంత నెంబర్స్ దగ్గర క్లోజ్ అయ్యాయనేది బయటికి రావడం లేదు. నిర్మాత ఏఎం రత్నంకు రావాల్సిన అడ్వాన్సులు చాలానే ఉన్నాయట.
అవి పూర్తిగా చేతికి అందితే ఫైనాన్సులు కట్టడానికి దారి దొరుకుతుంది. ఇదిలా ఉంచితే హిందీ వెర్షన్ కు సంబంధించి ప్రమోషన్ పెద్దగా చేయకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హైందవ ధర్మం పరిరక్షణ కోసం పోరాడిన వీరమల్లు కథ ఉత్తరాది ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని, అంత కంటెంట్ ఇందులో ఉందని తెలిసేలా పబ్లిసిటీ చేస్తేనే జనాలు వస్తారని ఆశిస్తున్నారు. కార్తికేయ 2, కాంతార తరహాలో దీన్ని చూస్తారని గుడ్డి నమ్మకం పెట్టుకోవడం సరికాదు. ఎలాంటి అంచనాలు లేకుండా సర్ప్రైజ్ ఇచ్చిన ప్యాకేజీలవి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ముందు గానే ఏవేవో లెక్కలతో పబ్లిక్ వస్తారు.
టాక్ ఖచ్చితంగా అదిరిపోతుందనే నమ్మకంతో రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణలు ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ మొత్తం స్ట్రాంగ్ రన్ రావాలంటే ప్రమోషన్ల గేరు మార్చాలి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రామిసింగ్ గానే ఉన్నాయి. నార్త్ లో ఆ స్థాయి స్పందన కనిపించాలి. ఎలాగూ హిందీలో ఈ నెలలో చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు. సో సరిగా వాడుకుంటే భారీ కలెక్షన్లు రాబట్టవచ్చు. ముంబైలో ఒక ఈవెంట్ ఉందని, దానికి యోగి ఆదిత్యనాధ్ లాంటి ఎందరో బిజెపి సిఎంలు, ప్రముఖులు వస్తారనే ప్రచారం జరిగింది కానీ ఎంతవరకు నిజమవుతుందో, అసలీ పది రోజుల్లో సాధ్యమవుతుందో లేదో చూడాలి.
This post was last modified on July 14, 2025 12:44 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…