రాజ్ కుమార్ రావుకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంది. విలక్షణమైన కథలను ఎంచుకుని రొటీన్ కి దూరంగా ఉంటాడని విమర్శకులు సైతం మెచ్చుకుంటారు. గత ఏడాది శ్రీకాంత్ లో అంధ వ్యాపారవేత్తగా అద్భుతంగా నటించడం చూశాం. దీనికి జాతీయ అవార్డు వస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. అంతకు ముందు న్యూటన్ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఎక్స్ పీరియన్స్ తనకు నటన పరంగా ఎన్నో మెట్లు పైకెక్కించింది. హిట్ ది ఫస్ట్ కేస్ ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజులకు తట్టిన మొదటి ఆప్షన్ రాజ్ కుమార్ రావే.
అది బాక్సాఫీస్ దగ్గర ఆడకపోవడం వేరే విషయం. తాజాగా అతను మాలిక్ గా థియేటర్లలో అడుగు పెట్టాడు. ట్రైలర్ గట్రా చూసి ఇదేదో మాంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనరని బయ్యర్లు వసూళ్ల మీద నమ్మకం పెట్టుకున్నారు. తీరా చూస్తే ఎప్పుడో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి గ్యాంగ్ స్టర్ల కథలన్నీ కలిపి దానికి మాలిక్ అనే పేరు పెట్టి జనం మీదకు వదిలాడు దర్శకుడు పులకిత్. దుర్మార్గుల వల్ల తండ్రి చనిపోతే దీపక్ అనే యువకుడు ఆయుధం పట్టి మాలిక్ గా మారతాడు. అలహాబాద్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాక శత్రువులు అతన్ని లేపేయాలని చూస్తారు. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు.
బాషా, కెజిఎఫ్, పుష్ప, యానిమల్ తదితర సినిమాలను ఇన్స్ పిరేషన్ గా తీసుకున్న పులకిత్ తాను ఎంత అవుట్ డేటెడ్ కంటెంట్ రాసుకున్నాడో స్క్రిప్ట్ దశలోనే గుర్తించి ఉంటే బాగుండేది. రొటీన్ వద్దని నిర్మొహమాటంగా జనం చెబుతున్నా సరే ఇలాంటి మాలిక్ లను కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు తీస్తారో అర్థం కాదు. అందులోనూ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు డార్క్ బ్యాక్ డ్రాప్స్ కి సెట్ కారు. అదేమీ ఆలోచించకుండా నిర్మాత దొరికాడు కదాని ఇలాంటి రొట్ట సినిమాలు వదిలితే నిర్మాతలు తడిగుడ్డలు వేసుకోవాల్సిందే. అయినా రాజ్ కుమార్ రావు లాంటి విలక్షణ హీరోలను వృథా చేసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…