అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఇవాళ అనుష్క ఘాటీ థియేటర్లలో విడుదలయ్యేది. ఇది వస్తుందనే నమ్మకంతో జూన్ నెలాఖరు దాకా బయ్యర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే మళ్ళీ వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ అంటూ యువి సంస్థ కారణాలు చెబుతోంది కానీ మళ్ళీ ఎప్పుడు రిలీజనేది మాత్రం చెప్పడం లేదు. నిన్న జరిగిన బాహుబలి 10 ఇయర్స్ రీ యునియన్ వేడుకైనా వచ్చి ఉంటే బాగుండేది కానీ స్వీటీ దర్శనం జరగలేదు. ప్రభాస్, రాజమౌళి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసినా వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేనని బదులు చెప్పడంతో తను లేకుండానే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైం నుంచే అనుష్క బయటికి రావడమనేది పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్లలో కూడా అనుష్క నేరుగా కనిపించలేదు. ఏదో ఇంటర్వ్యూ చేసినా దాని వీడియో వదల్లేదు. సినిమా హిట్టయిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే సోషల్ మీడియాలో లేనిపోని డిస్కషన్ జరిగేది. ఇప్పుడు ఘాటీ వచ్చే టైం అయ్యింది. కెరీర్ లో మొదటిసారి లేడీ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించడం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా చిన్న టీజర్, లిరికల్ సాంగ్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. అవి కూడా పెద్దగా బజ్ పెంచలేకపోయాయి.
అసలు అనుష్క బయటికి రాకపోవడం గురించి రకరకాల కథనాలు వస్తున్నా వాటికి క్లారిటీ రావాలంటే తను కనీసం ఒక్కసారైనా ప్రెస్ మీట్స్ లాంటి వాటిలో పాల్గొనాలి. ఘాటీ టైటిల్ రోల్ తనదే కాబట్టి ఈసారి తప్పుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏదో ఒక ఈవెంట్ కైనా రావాల్సి ఉంటుంది. భాగమతి తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకుంటున్న అనుష్క సైరా నరసింహారెడ్డిలో కాసేపు కనిపించి తళుక్కుమంది. ఒప్పుకుంటే తనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ ఎటొచ్చి తనే సిద్ధంగా లేదు. మలయాళం మూవీ కథనార్ కూడా విడుదలలో జాప్యం ఎదురుకోవడం ఫైనల్ ట్విస్టు.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…