అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఇవాళ అనుష్క ఘాటీ థియేటర్లలో విడుదలయ్యేది. ఇది వస్తుందనే నమ్మకంతో జూన్ నెలాఖరు దాకా బయ్యర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే మళ్ళీ వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విఎఫ్ఎక్స్ అంటూ యువి సంస్థ కారణాలు చెబుతోంది కానీ మళ్ళీ ఎప్పుడు రిలీజనేది మాత్రం చెప్పడం లేదు. నిన్న జరిగిన బాహుబలి 10 ఇయర్స్ రీ యునియన్ వేడుకైనా వచ్చి ఉంటే బాగుండేది కానీ స్వీటీ దర్శనం జరగలేదు. ప్రభాస్, రాజమౌళి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసినా వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేనని బదులు చెప్పడంతో తను లేకుండానే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైం నుంచే అనుష్క బయటికి రావడమనేది పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ సినిమా ప్రమోషన్లలో కూడా అనుష్క నేరుగా కనిపించలేదు. ఏదో ఇంటర్వ్యూ చేసినా దాని వీడియో వదల్లేదు. సినిమా హిట్టయిపోయింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే సోషల్ మీడియాలో లేనిపోని డిస్కషన్ జరిగేది. ఇప్పుడు ఘాటీ వచ్చే టైం అయ్యింది. కెరీర్ లో మొదటిసారి లేడీ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించడం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా చిన్న టీజర్, లిరికల్ సాంగ్ తప్ప ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. అవి కూడా పెద్దగా బజ్ పెంచలేకపోయాయి.
అసలు అనుష్క బయటికి రాకపోవడం గురించి రకరకాల కథనాలు వస్తున్నా వాటికి క్లారిటీ రావాలంటే తను కనీసం ఒక్కసారైనా ప్రెస్ మీట్స్ లాంటి వాటిలో పాల్గొనాలి. ఘాటీ టైటిల్ రోల్ తనదే కాబట్టి ఈసారి తప్పుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏదో ఒక ఈవెంట్ కైనా రావాల్సి ఉంటుంది. భాగమతి తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకుంటున్న అనుష్క సైరా నరసింహారెడ్డిలో కాసేపు కనిపించి తళుక్కుమంది. ఒప్పుకుంటే తనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ ఎటొచ్చి తనే సిద్ధంగా లేదు. మలయాళం మూవీ కథనార్ కూడా విడుదలలో జాప్యం ఎదురుకోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on July 11, 2025 2:23 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…