బాలీవుడ్ నటీనటులకు దక్షిణాది ఫిలిం సెలబ్రెటీలతో సంబంధాలు తక్కువగానే ఉంటాయి. ఇటీవలి కాలంలో అయినా సౌత్, నార్త్ యాక్టర్లు, టెక్నీషియన్ల కలయికలో సినిమాలు పెరుగుతున్నాయి కానీ.. ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు. అప్పుడప్పుడూ అక్కడి హీరోయిన్లు, విలన్లు ఇక్కడ అలా మెరిసి మాయం అయిపోయేవాళ్లంతే. అందువల్ల ఇక్కడి వాళ్లతో అక్కడి వాళ్లకు పెద్దగా పర్సనల్ రిలేషన్ ఉండేది కాదు. ఐతే తమిళంలో మిడ్ రేంజ్ హీరో అయిన విష్ణు విశాల్కు, బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన ఆమిర్కు మధ్య చాలా క్లోజ్ బాండ్ ఉన్న విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగమ్మాయి అయిన బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలను విష్ణు కొన్నేళ్ల కిందట పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఇటీవలే అమ్మాయి పుట్టింది.
తన నామకరణ వేడుకకు ఆమిర్ ఖాన్ అతిథిగా రావడం.. ఆయనే ఆ అమ్మాయికి ‘మీరా’ అని పేరు పెట్టడం విశేషం. ఈ సందర్భంగా జ్వాల ఏడుస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వేడుకకు ఆమిర్ రావడం, తనే పేరు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ మాట్లాడాడు. ఆమిర్ తమ కుటుంబానికి ఎంత క్లోజో అతను వెల్లడించాడు.
ఆమిర్ సోదరి క్యాన్సర్ బారిన పడి చెన్నైలో చికిత్స తీసుకున్నపుడు కొన్ని నెలల పాటు తమ ఇంట్లోనే ఉందని విష్ణు తెలిపాడు. అలాగే జ్వాల.. పది నెలల పాటు ఆమిర్ ఇంట్లో ఉన్నట్లు కూడా అతను వెల్లడించాడు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడానికి తాము ఎంతో ప్రయత్నించామని.. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయిందని.. దీంతో తాము జ్వాల తీవ్ర నిరాశకు గురైందని విష్ణు తెలిపాడు. ఈ విషయాన్ని ఆమిర్తో పంచుకుంటే.. తనకు సన్నిహితుడైన డాక్టర్కు కనెక్ట్ చేసి తమ ప్రయత్నం ఫలించేలా చేశాడని.. అంతేకాక జ్వాలను ముంబయిలో తన ఇంట్లోనే పెట్టుకుని డెలివరీ అయ్యే వరకు పది నెలల పాటు జాగ్రత్తగా చూసుకున్నాడని విష్ణు తెలిపాడు. ఒక దక్షిణాది యువ నటుడికి.. ఆమిర్ లాంటి లెజెండరీ యాక్టర్తో ఇంత సన్నిహిత సంబంధాలుండడం విశేషంగానే చెప్పాలి.
This post was last modified on July 9, 2025 4:14 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…