బాలీవుడ్ నటీనటులకు దక్షిణాది ఫిలిం సెలబ్రెటీలతో సంబంధాలు తక్కువగానే ఉంటాయి. ఇటీవలి కాలంలో అయినా సౌత్, నార్త్ యాక్టర్లు, టెక్నీషియన్ల కలయికలో సినిమాలు పెరుగుతున్నాయి కానీ.. ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు. అప్పుడప్పుడూ అక్కడి హీరోయిన్లు, విలన్లు ఇక్కడ అలా మెరిసి మాయం అయిపోయేవాళ్లంతే. అందువల్ల ఇక్కడి వాళ్లతో అక్కడి వాళ్లకు పెద్దగా పర్సనల్ రిలేషన్ ఉండేది కాదు. ఐతే తమిళంలో మిడ్ రేంజ్ హీరో అయిన విష్ణు విశాల్కు, బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన ఆమిర్కు మధ్య చాలా క్లోజ్ బాండ్ ఉన్న విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగమ్మాయి అయిన బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలను విష్ణు కొన్నేళ్ల కిందట పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఇటీవలే అమ్మాయి పుట్టింది.
తన నామకరణ వేడుకకు ఆమిర్ ఖాన్ అతిథిగా రావడం.. ఆయనే ఆ అమ్మాయికి ‘మీరా’ అని పేరు పెట్టడం విశేషం. ఈ సందర్భంగా జ్వాల ఏడుస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వేడుకకు ఆమిర్ రావడం, తనే పేరు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో విష్ణు విశాల్ మాట్లాడాడు. ఆమిర్ తమ కుటుంబానికి ఎంత క్లోజో అతను వెల్లడించాడు.
ఆమిర్ సోదరి క్యాన్సర్ బారిన పడి చెన్నైలో చికిత్స తీసుకున్నపుడు కొన్ని నెలల పాటు తమ ఇంట్లోనే ఉందని విష్ణు తెలిపాడు. అలాగే జ్వాల.. పది నెలల పాటు ఆమిర్ ఇంట్లో ఉన్నట్లు కూడా అతను వెల్లడించాడు. ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడానికి తాము ఎంతో ప్రయత్నించామని.. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయిందని.. దీంతో తాము జ్వాల తీవ్ర నిరాశకు గురైందని విష్ణు తెలిపాడు. ఈ విషయాన్ని ఆమిర్తో పంచుకుంటే.. తనకు సన్నిహితుడైన డాక్టర్కు కనెక్ట్ చేసి తమ ప్రయత్నం ఫలించేలా చేశాడని.. అంతేకాక జ్వాలను ముంబయిలో తన ఇంట్లోనే పెట్టుకుని డెలివరీ అయ్యే వరకు పది నెలల పాటు జాగ్రత్తగా చూసుకున్నాడని విష్ణు తెలిపాడు. ఒక దక్షిణాది యువ నటుడికి.. ఆమిర్ లాంటి లెజెండరీ యాక్టర్తో ఇంత సన్నిహిత సంబంధాలుండడం విశేషంగానే చెప్పాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…