‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ చివరి దశకు వచ్చేస్తోంది. ఇప్పటికే షో నుంచి సగం మందికి అటు ఇటుగా పార్టిసిపెంట్లు హౌస్ నుంచి నిష్క్రమించారు. తాజాగా ఈ వీకెండ్లో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఐతే ఈ ఎపిసోడ్ చూసిన జనాలందరిదీ ఒకటే కంప్లైంట్.. షోలో మెలోడ్రామా ఎక్కువైపోయిందని.
హౌస్లో అందరూ కలిసి కొన్ని వారాలు గడిపాక బంధాలు ఏర్పడటం సహజం. అందువల్ల గ్రూప్ నుంచి ఒకరు వెళ్లిపోతుంటే మిగతా వాళ్లు బాధ పడటం మామూలే. కానీ ఎమోషన్ల డోస్ మరీ ఎక్కువైపోతే.. అతిగా అనిపించడమూ సహజమే. తాజా ఎపిసోడ్లో అయితే మెలో డ్రామా మరీ ఎక్కువైపోయింది. ఎన్నో ఏళ్లు కలిసున్నాక ఒక వ్యక్తి తమను వదిలి వెళ్లిపోతున్నట్లు.. ఏదో విషాదం చోటు చేసుకున్నట్లు టూమచ్గా స్పందించారు హౌస్ మేట్స్.
షో నుంచి ఎలిమినేట్ అయిన మెహబూబ్తో పాటు.. అతడికి దూరం అవుతున్నందుకు మిగతా కంటెస్టెట్లూ అతిగా స్పందిచారు. మెహబూబ్కు బాగా క్లోజ్ అయిన సోహైల్ అయితే బోరున ఏడ్చేసి నానా హంగామా చేశాడు. మెహబూబ్ వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నపుడు కూడా అతిగా స్పందించాడు. ఓవర్ ఎమోషనల్ అయ్యాడు. మిగతా హౌస్ మేట్స్లో కూడా అభిజిత్ మినహా అందరూ అతిగానే స్పందించారు.
‘బిగ్ బాస్’ టీం ఉద్దేశపూర్వకంగా ఈ డోస్ పెంచే ప్రయత్నం చేసిందేమో అన్న సందేహాలు కలిగింది వ్యవహారం చూస్తే. ఎమోషన్లు ఒక స్థాయి వరకు ఉంటే అవి ప్లస్ అవుతాయి కానీ.. అవి ఓవర్ అయితే సెంటిమెంట్ సినిమాలా తయారవుతుంది. ఇలాంటివి ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. కాబట్టి ఈ షోను ఇంకోసారి రివైండ్ చేసుకుని చూస్తే నాగార్జున అండ్ టీంకు విషయం అర్థమవుతుంది. ఇకముందు వారాంతాల్లో ఎలిమినేషన్ టైంలో ఈ మెలోడ్రామా డోస్ కొంచెం తక్కువుండేలా చూసుకుంటే మంచిదేమో.
This post was last modified on November 16, 2020 4:10 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…