ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా కన్నుమూశారు. ఇప్పటి తరానికి ఈ కోణంలోనే పరిచయం ఉన్నప్పటికీ శివశక్తి దత్తా వెనుక బలమైన నేపథ్యం ఉంది. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8 జన్మించారు. రాజమౌళికి స్వయానా పెదనాన్న. అంటే రచయిత విజయేంద్ర ప్రసాద్ కు అన్నయ్య. శివశక్తి దత్తా స్వస్థలం రాజమండ్రి దగ్గరున్న కోవూరు. చిన్నతనంలోనే వీళ్లది పెద్ద కుటుంబం. తండ్రి విజయ అప్పారావు గారు భూస్వామి, కాంట్రాక్టర్. అప్పట్లోనే పన్నెండు బస్సులతో ట్రాన్స్ పోర్ట్ కంపెనీ నడిపేవారు. శివశక్తిదత్తా రెండో సంతానం.
ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్ మీడియట్ చదువుకున్న శివశక్తి దత్తా మధ్యలోనే చదువు ఆపేసి ముంబై జెజె స్కూల్ అఫ్ ఆర్ట్స్ లో చేరిపోయారు. అక్కడే డిప్లమా అందుకుని తిరిగి స్వంత ఊరు వచ్చారు. ఇదంతా రెండు సంవత్సరాల కాలంలో జరిగింది. కమలేష్ అనే కలం పేరుతో శివశక్తి దత్తా చేసే రచనలు పత్రికల్లో వచ్చేవి. తర్వాత చెన్నై వెళ్ళిపోయి కొందరు దర్శకుల దగ్గర సహాయకుడిగా పని చేశారు. పిల్లనగ్రోవి అనే సినిమా తీయాలని మొదలుపెట్టి ,షూటింగ్ పూర్తి చేయకుండానే ఆపేశారు. ఆ సమయంలో రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడింది. తమ్ముడు విజయేంద్రప్రసాద్ తో కలిసి నాగార్జున జానకిరాముడుకి రచన చేశారు.
అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు కొడుకు కీరవాణి, ఇంకోవైపు తమ్ముడు విజయేంద్రప్రసాద్ కెరీర్ వెలిగిపోతుండగా శివశక్తిదత్తా సంస్కృతంలోనూ పట్టు సాధించి పలు గేయాలు, రచనలు చేసేవారు. 1996లో విజయేంద్రప్రసాద్ తో కలిసి అర్ధాంగిని డైరెక్ట్ చేశారు కానీ అది ఫ్లాప్ అయ్యింది. తర్వాత 2007లో కృష్ణ హీరోగా చంద్రహాస్ ని తీశారు. అది ఆశించిన ఫలితం అందుకోలేదు. పాటల రచయితగా శివశక్తి దత్తా ఛత్రపతి, బాహుబలి,. ఓం నమో వెంకటేశాయ, ఎన్టీఆర్ కథానాయకుడు, సవ్యసాచి, జాంబీరెడ్డి, హనుమాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు గీత రచన చేశారు. ఈయన స్వర్గస్థులు కావడం ఇండస్ట్రీకి తీరని లోటు.
This post was last modified on July 8, 2025 10:57 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…