భారీ సినిమాలకు సంబంధించిన రిలీజు డేట్ల వ్యవహారం సస్పెన్స్ సినిమాలను మించిన ట్విస్టులతో సాగుతోంది. సెప్టెంబర్ 25 ఓజి, అఖండ 2 క్లాష్ మీద ఇప్పటికే ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. అన్న మాట ప్రకారమే పవన్ వస్తాడా రాడా అనే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా విశ్వంభరను సెప్టెంబర్ 18 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో యువి క్రియేషన్స్ ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ఒకవేళ ఓజి కనక డ్రాప్ అయితే విశ్వంభర ఆ స్లాట్ ని వాడుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు అంతర్గత సమాచారం.
అంటే ప్రస్తుతానికి ఓజి డేట్ సెప్టెంబర్ 25 ఉంటుంది. వాయిదా పడే సూచనలు ఏ మాత్రం ఉన్నా సెప్టెంబర్ 18 నుంచి 25కి విశ్వంభర షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మరోసారి చిరంజీవి బాలకృష్ణల పోటీ చూడొచ్చు. లేదూ బాలయ్యతో పవన్ క్లాష్ ఫిక్స్ అయితే, మాత్రం అప్పుడు మెగాస్టార్ పక్కకు తప్పుకోవాల్సి రావొచ్చు. ఇదంతా ప్రస్తుతం ఊహాగానాల స్టేజిలోనే ఉంది. ఎందుకంటే విశ్వంభర ఐటెం సాంగ్ ఇంకా పెండింగ్ ఉంది. మౌని రాయ్ ని తీసుకున్నారనే వార్త వచ్చింది కానీ యూనిట్ నుంచి ఎలాంటి న్యూస్ లేవు. దర్శకుడు వసిష్ఠ విఎఫ్ఎక్స్ కోసమే లేట్ అవుతోందని, కాగానే విడుదల తేదీ అనౌన్స్ చేస్తున్నామని అంటున్నాడు.
యూనిట్ నుంచి వినిపిస్తున్న మాటల ప్రకారం టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ట్రైలర్ తో ఎగిరిపోతుందని అంటున్నారు. వశిష్ఠని తక్కువంచనా వేయడం కరెక్ట్ కాదని, తక్కువ బడ్జెట్ తో బింబిసారనే ఆ స్థాయిలో తీసినప్పుడు విశ్వంభర నుంచి బెస్ట్ ఆశించవచ్చని ఊరిస్తున్నారు. మెగా 157 లో బిజీగా ఉన్న చిరంజీవి త్వరలోనే బ్యాలన్స్ ఉన్న విశ్వంభర పాట కోసం డేట్లు ఇవ్వబోతున్నారు. కొత్త సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ ఇంకా రిలీజ్ డేట్ సందిగ్ధం కొనసాగడం మెగా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఏదైనా ఫ్రెష్ గా ప్రమోషన్లు చేసి హైప్ పెంచితే తప్ప విశ్వంభర మీద హైప్ పెరగడం కష్టం.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…