భారీ సినిమాలకు సంబంధించిన రిలీజు డేట్ల వ్యవహారం సస్పెన్స్ సినిమాలను మించిన ట్విస్టులతో సాగుతోంది. సెప్టెంబర్ 25 ఓజి, అఖండ 2 క్లాష్ మీద ఇప్పటికే ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. అన్న మాట ప్రకారమే పవన్ వస్తాడా రాడా అనే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా విశ్వంభరను సెప్టెంబర్ 18 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో యువి క్రియేషన్స్ ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ఒకవేళ ఓజి కనక డ్రాప్ అయితే విశ్వంభర ఆ స్లాట్ ని వాడుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు అంతర్గత సమాచారం.
అంటే ప్రస్తుతానికి ఓజి డేట్ సెప్టెంబర్ 25 ఉంటుంది. వాయిదా పడే సూచనలు ఏ మాత్రం ఉన్నా సెప్టెంబర్ 18 నుంచి 25కి విశ్వంభర షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు మరోసారి చిరంజీవి బాలకృష్ణల పోటీ చూడొచ్చు. లేదూ బాలయ్యతో పవన్ క్లాష్ ఫిక్స్ అయితే, మాత్రం అప్పుడు మెగాస్టార్ పక్కకు తప్పుకోవాల్సి రావొచ్చు. ఇదంతా ప్రస్తుతం ఊహాగానాల స్టేజిలోనే ఉంది. ఎందుకంటే విశ్వంభర ఐటెం సాంగ్ ఇంకా పెండింగ్ ఉంది. మౌని రాయ్ ని తీసుకున్నారనే వార్త వచ్చింది కానీ యూనిట్ నుంచి ఎలాంటి న్యూస్ లేవు. దర్శకుడు వసిష్ఠ విఎఫ్ఎక్స్ కోసమే లేట్ అవుతోందని, కాగానే విడుదల తేదీ అనౌన్స్ చేస్తున్నామని అంటున్నాడు.
యూనిట్ నుంచి వినిపిస్తున్న మాటల ప్రకారం టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ట్రైలర్ తో ఎగిరిపోతుందని అంటున్నారు. వశిష్ఠని తక్కువంచనా వేయడం కరెక్ట్ కాదని, తక్కువ బడ్జెట్ తో బింబిసారనే ఆ స్థాయిలో తీసినప్పుడు విశ్వంభర నుంచి బెస్ట్ ఆశించవచ్చని ఊరిస్తున్నారు. మెగా 157 లో బిజీగా ఉన్న చిరంజీవి త్వరలోనే బ్యాలన్స్ ఉన్న విశ్వంభర పాట కోసం డేట్లు ఇవ్వబోతున్నారు. కొత్త సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ ఇంకా రిలీజ్ డేట్ సందిగ్ధం కొనసాగడం మెగా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఏదైనా ఫ్రెష్ గా ప్రమోషన్లు చేసి హైప్ పెంచితే తప్ప విశ్వంభర మీద హైప్ పెరగడం కష్టం.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…