జూలై 11 విడుదల కావాల్సిన అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా పడటం దాదాపు ఫిక్స్. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉండటం వల్లే రేసు నుంచి తప్పుకున్నట్టు ఫ్రెష్ అప్డేట్. అందుకే ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ గా ఉన్న యువి క్రియేషన్స్ మొత్తం వర్క్ అయ్యాక కొత్త డేట్ మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇదిలా ఉండగా ఘాటీ వాయిదా సుహాస్ కు చాలా పెద్ద ప్లస్ కానుంది. ఎందుకంటే తన కొత్త సినిమా ఓ భామ అయ్యో రామా జూలై 11నే వస్తోంది. ప్రమోషన్లు చేస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మొన్న మహా న్యూస్ ఛానల్ మీద దాడి జరిగినప్పుడు సుహాస్ అక్కడే ఉన్నాడు.
చాలా పోటీగా మారుతుందనుకున్న ఘాటీ తప్పుకోవడంతో ఓ భామ అయ్యో రామా మీద ఆడియన్స్ అటెన్షన్ వెళ్ళిపోతుంది. అసలే సోలోగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సుహాస్ ఆశలన్నీ దీని మీద ఉన్నాయి. రైటర్ పద్మభూషణ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ దొరకలేదు. ఎప్పుడో ఒప్పుకుని చేసిన గొర్రె పురాణం, శ్రీ రంగనీతులు లాంటివి దారుణంగా ఫ్లాప్ కాగా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు కొంత పర్వాలేదనిపించుకుంది. దిల్ రాజు నిర్మించిన జనక అయితే గనక మీద నమ్మకంతో సుహాస్ ఓవర్సీస్ హక్కులు కొంటే అదేమో ఇంకో సూపర్ ఫ్లాప్ చేతిలో పెట్టి కష్టం, నష్టం రెండూ మిగిల్చింది.
ఆర్టిస్టుగా ఎంత బిజీగా ఉన్నా సుహాస్ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ భామ అయ్యో రామా కంటెంట్ చూస్తుంటే మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్నట్టే అనిపిస్తోంది. కాకపోతే బజ్ లేని ఇలాంటి టైంలో వసూళ్లు రావాలంటే పాజిటివ్ టాక్ చాలా కీలకం. అందులోనూ బాక్సాఫీస్ కొంచెం అప్ అండ్ డౌన్ లో ఉంది. కుబేర హిట్టయినా కన్నప్ప ఆశించిన స్థాయిలో దూసుకెళ్లడం లేదు.తమ్ముడు ఫలితం ఎల్లుండి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ భామ అయ్యో రామా కనక క్లిక్ అయితే థియేటర్ ఆడియన్స్ వస్తారు.సుహాస్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఉప్పు కప్పురంబు జూలై 4 నేరుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
This post was last modified on July 2, 2025 12:17 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…