Movie News

అటు విశ్వంభర.. ఇటు ఘాటి.. ఏం జరుగుతోంది?

టాలీవుడ్లో ఒకప్పుడు మంచి సక్సెస్ రేట్ ఉన్న పెద్ద బేనర్లలో ఒకటిగా ఉండేది యువి క్రియేషన్స్. ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో అరంగేట్రం చేసిన ఈ సంస్థ మరిన్ని విజయాలందుకుంది. ప్రభాస్‌కు అత్యంత సన్నిహితులైన వంశీ, ప్రమోద్ కలిసి మొదలుపెట్టిన బేనర్ ఇది. దీన్ని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థలాగే భావిస్తారందరూ. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించాక.. ఈ బేనర్లో ప్రభాస్ వరుసగా రెండు సినిమాలు చేశాడు. అవే.. సాహో, రాధేశ్యామ్. కానీ ఏం లాభం? ఆ రెండు చిత్రాలూ నిరాశపరిచాయి. వీటి వల్ల యువి అధినేతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది.

ఈ ఎదురుదెబ్బలు చాలవన్నట్లు యువి వాళ్లు లైన్లో పెట్టిన రెండు క్రేజీ ప్రాజెక్టులు ఇప్పుడు అయోమయ స్థితిలో పడిపోయాయి. మెగాస్టార్ చిరంజీవితో యువి అధినేతలు మొదలుపెట్టిన ‘విశ్వంభర’ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం.. సంవత్సరం చివరిలోపు అయినా వస్తుందా అన్నది అనుమానంగా మారింది. ‘విశ్వంభర’ వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎంతకీ తెరపడడం లేదు.

‘విశ్వంభర’ పరిస్థితి ఇలా ఉంటే.. యువి వాళ్లు ప్రొడ్యూస్ చేస్తున్న మరో క్రేజీ మూవీ ‘ఘాటి’ సంగతి కూడా ఎటూ తేలడం లేదు. ఇప్పటికే ఈ సినిమాను ఒకసారి వాయిదా వేశారు. జులై 11కు కొత్త డేట్ ఇచ్చారు. కానీ అది దగ్గర పడుతున్నా గత కొన్ని రోజుల నుంచి సౌండ్ లేదు. తీరా చూస్తే సినిమా వాయిదా అనే సమచారం బయటికి వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం అవుతుండడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదట.

కొత్త డేట్ ప్రకటించి ఎక్కువ రోజులేమీ కాలేదు. మరి డేట్ ప్రకటించేటపుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడు పూర్తవుతాయో అవగాహన లేదా అన్నది ప్రశ్న. కొత్త డేట్ ఎప్పుడో క్లారిటీ లేదు మరి. యువి లాంటి పెద్ద బేనర్ ప్రొడ్యూస్ చేసిన రెండు క్రేజీ ప్రాజెక్టుల విషయంలో ఈ అయోమయం ఏమిటో? వంశీ, ప్రమోద్‌లకు వరుసగా ఈ తలనొప్పులేంటి.. వారి ప్లానింగ్ ఎందుకు ఇలా దెబ్బ తింటోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

This post was last modified on July 2, 2025 10:34 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

32 minutes ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

33 minutes ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

1 hour ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

10 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago