లాక్ డౌన్ కారణంగా రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గి, నెట్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో టీవీల్లో సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతుంటే, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ట్రాఫిక్ను తట్టుకోలేక సెట్టింగ్స్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్లు అయితే పండగ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లకు ఫుల్లు గిరాకీ పెరిగింది. ఈ టైమ్లోనే అమెజాన్ ఓ అదిరిపోయే ఐడియా వేసింది.
దేశంలో అతిపెద్ద టెలివిజన్ సంస్థల్లో ఒకటైన జీ గ్రూప్తో ఓ తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది అమెజాన్. జీ ఛానెల్స్లో వచ్చే కొన్ని సూపర్ హిట్ సినిమాలను తీసుకుని, అమెజాన్ ప్రైమ్లో ప్రసారం చేయాలని భావిస్తోంది. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది. జీగ్రూప్కు ఇప్పటికే ‘జీ5’ పేరుతో ఓటీటీ ప్లాట్ఫాం ఉంది. అమెజాన్ అంత రేంజ్లో కాకపోయినా, జీ5కి కూడా ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది.
దాంతో ఇప్పుడు ఆ సినిమాలను ఆమెజాన్కి ఇస్తే, జీ5కి వ్యూస్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. దాంతో జీ నెట్వర్క్ ఆలోచనలో పడిందట. ఆ సినిమా హక్కులను ఇచ్చేందుకు భారీగా డిమాండ్ చేస్తుందని టాక్. అయితే లాక్డౌన్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందనే వార్తలు రావడంతో అమెజాన్ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
This post was last modified on April 9, 2020 6:21 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…