2002లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కాంటాలగా’ పాటతో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన షెఫాలీ జరివాలా.. రెండు రోజుల కిందట హఠాత్తుగా చనిపోవడం బాలీవుడ్కు పెద్ద షాక్. షెఫాలీ వయసు 42 ఏళ్లే. తనను చూస్తే అంత వయసున్నట్లు కూడా కనిపించదు. రోజూ జిమ్కూ వెళ్తూ, ఫిట్గా కనిపించే షెఫాలీకి గుండెపోటు రావడమేంటి.. చికిత్స అందించేలోపు చనిపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కావచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే షెఫాలీ విషయంలో కారణం వేరై ఉండచ్చని భావిస్తున్నారు. అందంపై ఉన్న శ్రద్ధే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చిందని అంటున్నారు.
వయసు పెరగకుండా యవ్వనంతో కనిపించేందుకు చికిత్స తీసుకుంటున్న షెఫాలీ.. ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రాణాలు వదిలిందని ముంబయి మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొంత కాలంగా షెఫాలీ యాంటీ ఏజియింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటోందట. ఇందులో భాగంగా రోజు ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకుంటోందట. ఐతే శుక్రవారం ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉండడంతో అందుకోసం షెఫాలీ ఉపవాసం ఉన్నారట.
ఏమీ తినకుండా ఆమె యాంటీ ఏజియింగ్ ఇంజెక్షన్లు, మాత్రలు వేసుకోవడంతో శరీరంలో అత్యవసర పరిస్థితి తలెత్తిందని.. కార్డియాక్ అరెస్ట్ అయి నిమిషాల్లో ప్రాణం కోల్పోయారని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందన్నది కుటుంబ వర్గాలే చెప్పాలి. ‘కాంటాలగా’తో ఫేమస్ అయ్యాక షెఫాలీ.. సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ముజ్సే షాదీ కరోగీ’ సహా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ టీవీ షోలోనూ పాల్గొంది. 2004లోనే సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్ను పెళ్లాడిన షెఫాలీ… ఐదేళ్ల తర్వాత తన నుంచి విడిపోయింది. 2015లో ఆమె పరాగ్ త్యాగిని పెళ్లాడింది. షెఫాలీ ప్రాణాలు కోల్పోయినపుడు భర్త ఆమె వెంటే ఉన్నాడు.
This post was last modified on June 29, 2025 2:51 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…