Movie News

సూర్యతో అట్లూరి.. ఆ బయోపిక్ చేద్దామని వెళ్లి

వెంకీ అట్లూరి.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. నటుడిగా తెలుగు తెరకు పరిచయమై, అందులో సక్సెస్ కాలేక కనుమరుగైన వెంకీ.. చాలా గ్యాప్ తర్వాత ‘తొలి ప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్నందుకున్న అతను.. తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దె’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. కానీ వెంకీ తర్వాతి రెండు చిత్రాలు ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నాయి. కమర్షియల్‌గానూ మంచి విజయాన్నందుకున్నాయి.

దీంతో వెంకీకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఏకంగా తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య.. వెంకీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇటీవలే వీరి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయింది. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో సూర్యతో తన సినిమా ఎలా ఓకే అయిందో వివరించాడు వెంకీ. నిజానికి తాను సూర్యతో చేయాలనుకున్నది ఒక బయోపిక్ అని.. కానీ చివరికి ఒక ఫ్యామిలీ డ్రామా తీస్తున్నానని వెంకీ వెల్లడించాడు.

ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ దేశంలో మారుతి మోటార్స్ మొదలుపెట్టడానికి చేసిన కృషి.. అది దేశంలో విప్లవానికి దారి తీసిన వైనం గురించి సినిమా తీయాలన్నది తన ప్రణాళిక అని వెంకీ తెలిపాడు. ఐతే ఈ కథతో సూర్యను సంప్రదించినపుడు.. అప్పటికే తాను ‘సూరారై పొట్రు’ (ఆకాశమే నీ హద్దురా), ‘జై భీమ్’ రూపంలో రెండు బయోపిక్స్ చేశానని.. మళ్లీ ఇంకో బయోపిక్ చేస్తే ఎలా అని సంశయం వ్యక్తం చేశాడని.. దీంతో పాటుగా సంజయ్ గాంధీ మీద సినిమా తీయడానికి అనుమతులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని.. దీంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశానని వెంకీ తెలిపాడు.

ఆ తర్వాత తాను సూర్య కోసం ఒక ప్లెజెంట్ ఫ్యామిలీ డ్రామా రాశానని.. ఈ కథ వినగానే సూర్యకు తెగ నచ్చేసిందని.. ఫస్ట్ నరేషన్ టైంకి తాను క్లైమాక్స్ కూడా చెప్పలేదని.. అయినా సూర్య సినిమా చేయడానికి అంగీకరించారని వెంకీ వెల్లడించాడు. తర్వాత పూర్తి స్క్రిప్టు రెడీ చేశానని.. ఇందులో సూర్య పాత్ర ‘గజిని’లోని సంజయ్ రామస్వామిని పోలి ఉంటుందని వెంకీ తెలిపాడు.

This post was last modified on June 29, 2025 2:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

27 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago