టాలీవుడ్ హీరోల్లోనూ ఫ్యాన్స్ ఉన్న స్టార్లలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన పేరు చెబితే ఊగిపోయే హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో చెప్పుకోవాల్సింది నితిన్నే. కెరీర్ ఆరంభం నుంచి తనను తాను పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా చెప్పుకుంటూ వస్తున్నాడు నితిన్. తన సినిమాల్లో అతను పవన్కు ఇచ్చే ఎలివేషన్లు.. వాడే రెఫరెన్సుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నితిన్ పట్ల పవన్కు సైతం ఎంతో అభిమానం ఉంది. అతడి సినిమాలను ప్రమోట్ చేయడమే కాక.. తనతో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాను సైతం ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ఒక దశలో నితిన్ ప్రతి సినిమాలోనూ పవన్ రెఫరెన్సులు కనిపించడంతో తన అభిమాన హీరోను బాగా వాడేస్తున్నాడంటూ కొందరు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.
ఈ విషయంలో నితిన్ కొంచెం నొచ్చుకున్నట్లే ఉన్నాడు. అందుకే తన కొత్త చిత్రానికి పవన్ కళ్యాణ్ టైటిల్ ‘తమ్ముడు’ పెట్టడానికి అతను ముందు ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు. దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు ముందుగా తనకు కథ చెప్పినపుడు ‘తమ్ముడు’ అని టైటిల్ చెప్పారని.. ఐతే తాను ఆ టైటిల్ వద్దని చెప్పానని నితిన్ వెల్లడించాడు. ఇప్పటికే తాను పవన్ కళ్యాణ్ను బాగా వాడేస్తున్నానని కొందరు అంటున్నారని.. అందుకే ఈ టైటిల్ సినిమాకు వద్దని తాను చెప్పానని నితిన్ తెలిపాడు.
కానీ పవన్ సినిమా టైటిల్ పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని.. ఈ కథకు ఆ టైటిలే పర్ఫెక్ట్ అని తనకు నచ్చజెప్పడంతో సరే అన్నానని నితిన్ తెలిపాడు. పవన్ కళ్యాణ్తో ‘వకీల్ సాబ్’ చేసి హిట్టు కొట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ‘తమ్ముడు’. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నితిన్.. ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిన ఒకప్పటి హీరోయిన్ లయ.. ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆమె నితిన్కు సోదరిగా నటిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కథానాయికల పాత్రలు పోషించారు.
This post was last modified on June 28, 2025 2:49 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…