లాక్ డౌన్ అవడం వల్ల కొందరు మాత్రమే ఇంట్లో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు అన్నట్టు వార్తలు వండేస్తున్నారు సినిమా జర్నలిస్టులు. అసలు షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియక అందరూ అయోమయంలో వుంటే… లాక్ డౌన్ ఎత్తేయడం ఆలస్యం… కెమెరా భుజాన వేసుకుని షూటింగ్ చేసేస్తారని రాసేస్తున్నారు. పైగా ఈ లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాలూ ఆగిపోతే, సదరు హీరోలు ఇప్పట్లో ఖాళీ ఎవరు కనుక వాళ్ళతో సినిమాలు అనుకున్న దర్శకులు వేరే చిత్రాలు చేస్తారని ప్రచారం చేసేస్తున్నారు.
త్రివిక్రమ్ తదుపరి చిత్రం తారక్ తో అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. తారక్ కొన్నాళ్ళు ఆర్.ఆర్.ఆర్. తో బిజీగా ఉంటాడు కనుక త్రివిక్రమ్ ఈలోగా నాని లేదా నాగ చైతన్యతో ఒక సినిమా లాగించేస్తాడని రాస్తున్నారు. పోనీ త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నాడు అనుకున్నా నాని, చైతన్య సినిమాలు మధ్యలో ఆగిపోయి లేవా? ఇంత లాజిక్ ఎవడు ఆలోచిస్తాడండీ.. లాక్ డౌన్ లో న్యూస్ లేక ఏదోకటి వండాల్సిన సిట్యుయేషన్ అర్ధం చేసుకోక అంటారేమో. అంతేలెండి.. ఎవరి పాట్లు వారివిపుడు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…