ఓవైపు వరుస ఫ్లాపులు, ఇంకోవైపు రాజకీయాల్లో బిజీ.. ఇలా కొన్నేళ్ల ముందు కమల్ హాసన్ను అందరూ మరిచిపోయే పరిస్థితి కనిపించింది. అలాంటి సమయంలో ‘విక్రమ్’ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు ఈ లెజెండరీ నటుడు. ఆ సినిమా తమిళనాట హైయెస్ట్ గ్రాసర్గా నిలిచే స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా చాలా బాగా ఆడింది. ఇండియన్-2, థగ్ లైఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉండడంతో కమల్ మళ్లీ కెరీర్లో పీక్స్ చూడబోతున్నారని అభిమానులు ఆశించారు.
కానీ శంకర్ తీసిన ‘ఇండియన్-2’ కోలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ‘థగ్ లైఫ్’ అయినా హిట్టవుతుందనుకుంటే.. అది కూడా ‘ఇండియన్-2’ తరహా ఫలితాన్నే అందుకుంది. దీంతో కమల్ తిరిగి ‘విక్రమ్’కు ముందు స్థితికి వెళ్లిపోయారు. ఆయన మార్కెట్ మళ్లీ బాగా డౌన్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమల్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ‘విక్రమ్-2’ ప్రపోజల్ ఉంది కానీ.. అది ఇప్పుడిప్పుడే మొదలు కాదు. యాక్షన్ కొరియోగ్రాఫర్లు అన్బు-అరివుల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు కానీ.. అది పెండింగ్లో పడిపోయింది. ‘ఇండియన్-3’కి సంబంధించి కొంత వర్క్ మిగిలి ఉండగా.. దాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.
ఇవన్నీ కాదని కమల్ ఇప్పుడు ఓ కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. సిద్దార్థ్ మూవీ ‘చిన్నా’తో మంచి పేరు సంపాదించి.. ఇటీవల విక్రమ్ సినిమా ‘వీర ధీర శూర-2’ ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్న అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ నటించబోతున్నారట. విక్రమ్తో ‘వీర ధీర శూర-1’ కూడా చేయాల్సి ఉన్నప్పటికీ.. దాని కంటే కమల్తో ఓ సినిమా చేయబోతున్నాడట అరుణ్. కథ ఓకే అయింది. ‘థగ్ లైఫ్’ దెబ్బ కొట్టినప్పటికీ ఈ చిత్రాన్ని కూడా తన సొంత నిర్మాణ సంస్థలోనే చేయబోతున్నాడట కమల్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…