ఇంకో ఇరవై రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఘాటీ విడుదల కానుంది. జూలై 11 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని యువి క్రియేషన్స్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అభిమానులు అలెర్ట్ అయిపోయారు. అయితే ఇటీవలే విడుదల చేసిన మొదటి లిరికల్ సాంగ్ లో అనుష్కను చూపించి చూపించకుండా కేవలం రెండు షాట్లకు పరిమితం చేయడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఫీలవుతున్నారు. విక్రమ్ ప్రభుతో తన పెళ్లి జరుగుతున్న పాటగా ప్రొజెక్ట్ చేయడం వరకు బాగానే ఉంది. కానీ కనీసం క్లోజ్ అప్ లో ఒక్క పిక్ చూపించకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అసలు ఎందుకిలా డిజైన్ చేశారనే అనుమానం కలుగుతోంది
టైం చాలా పరిమితంగా ఉండటంతో ఘాటీ ప్రమోషన్ల స్పీడ్ పెంచాలి. టైటిల్ రోల్ అనుష్కనే కాబట్టి మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలో ఏదోలా మేనేజ్ చేశారు కానీ ఈసారి అదే రిపీట్ చేస్తారా అనే డౌట్ లేకపోలేదు. ఆ సినిమా రిలీజ్ టైంలో వీడియో బైట్స్ తప్ప అనుష్క తానుగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఈవెంట్ కు రావడం లాంటివి చేయలేదు. ఇప్పుడు ఘాటీ విషయంలో కూడా ఇలాగే చేస్తుందా అంటే ఏమో ఇప్పుడే చెప్పలేం. దర్శకుడు క్రిష్, డాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ కనిపించినంత సేపు కూడా పాటలో అనుష్కని చూపించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
సరే ఇదంతా ఎలా ఉన్నా ఘాటీకి ప్రస్తుతానికి పెద్ద బజ్ లేదు. దాన్ని పెంచాలి. ఇప్పటికే పలు వాయిదాల వల్ల హైప్ తగ్గింది. అప్పుడెప్పుడో చిన్న టీజర్ తో ఆసక్తి పెంచారు కానీ తర్వాత సైలెంట్ అయ్యారు. గంజాయి వ్యాపారంతో మాఫియా డాన్ గా మారిన ఒక మహిళ బయోపిక్ గా రూపొందిన ఘాటీలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయట. హరిహర వీరమల్లుకు సరిగ్గా రెండు వారాల ముందు వస్తున్న ఘాటీకి ప్రస్తుతానికి ఎలాంటి కాంపిటీషన్ లేదు. కంటెంట్ కనక బాగుంటే అనుష్కకు మరో హిట్టు ఖాతాలో పడుతుంది. మరి ప్రమోషన్ల టైంలో అయినా స్వీటీ దర్శనం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి.
This post was last modified on June 23, 2025 10:04 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…