Movie News

నాని 28.. సస్పెన్స్ వీడబోతోంది

నేచురల్ స్టార్ నాని చివరి సినిమా ‘వి’ టాక్ పరంగా చూస్తే డిజాస్టర్ అనే చెప్పాలి. దానికి ముందు ‘జెర్సీ’ని మినహాయిస్తే గత కొన్నేళ్లలో నాని చేసిన సినిమాలన్నీ నిరాశ పరిచినవే. అతడి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగట్లేదన్నది వాస్తవం. ఐతే ఈ ప్రభావం అతడి భవిష్యత్తు ప్రాజెక్టుల మీద ఎంతమాత్రం కనిపించడం లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను అతను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇప్పటికే నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’ చేస్తున్న నాని.. ఇటీవలే ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌తో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ప్రెస్టీజియస్ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది నాని 27వ సినిమా కాగా.. ఇప్పుడు 28వ సినిమాకు ముహూర్తం కుదిరింది. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించబోతున్నారు.

నాని 28వ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండటం విశేషం. ఆ సంస్థ ట్విట్టర్లో.. ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికర పోస్టు పెట్టింది. ‘‘రేపు మంచి రోజట.. రేపు మాట్లాడుకుందాం’’ అంటూ నాని 28 హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది మైత్రీ సంస్థ. ఇంతకు ముందు నానితో మైత్రీ వాళ్లు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను నిర్మించారు. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. అయినా సరే.. మళ్లీ అతడితో సినిమాను లైన్లో పెట్టారు. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన ఓ కథకు నాని ఓకే చెప్పాడు. అలాగే సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడికి కూడా కమిట్మెంట్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. సుకుమార్‌తో మైత్రీ వాళ్లకున్న అనుబంధం దృష్ట్యా నాని 28కు సుక్కు శిష్యుడే దర్శకుడై ఉండొచ్చని భావిస్తున్నారు. అలా కాకుండా వివేక్‌తో సినిమాను అనౌన్స్ చేసినా ఆశ్చర్యం లేదేమో?

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

11 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

40 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago