Movie News

మీమ్స్ మీద పంచులేసిన నాగార్జున

విడుదలకు ముందు జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఇది ఏ హీరో సినిమా కాదని, కేవలం శేఖర్ కమ్ముల మూవీ అని, ఒక మాయాబజార్ లా ఇది అందరికీ చెందుతుందని చెప్పడం ప్రేక్షకులకు గుర్తే. రిలీజ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఆయనే మాట్లాడుతూ ఇది దీపక్ పాత్ర చుట్టూ తిరిగే కథ కాబట్టే ఒప్పుకున్నానని చెప్పడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మీమ్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ధనుష్ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయి ఇప్పుడు మాట మారుస్తారా అంటూ ట్వీట్లు పెట్టడం బాగానే ట్రెండ్ అయ్యింది. ఇవన్నీ నేరుగా నాగార్జున దృష్టికి వెళ్లిపోయాయి. దానికాయన స్పందించారు.

కుబేర సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తాను అప్పుడూ ఇప్పుడు ఒకేమాట మీద ఉన్నానని, కుబేర ముమ్మాటికీ శేఖర్ కమ్ముల సినిమానేనని, తాను వేరే ఉద్దేశంలో అన్నది ఇంకో అర్థంలో బయటికి వెళ్ళిపోయి మీమ్స్ వచ్చాయని అంతే తప్ప ఇంకేమి లేదని కుండ బద్దలు కొట్టేశారు. తాను, ధనుష్, రష్మిక మందన్న, ఇతర ఆర్టిస్టులు ఎవరూ కూడా పేర్లతో కాకుండా క్యారెక్టర్లతో గుర్తుండిపోయేలా గొప్ప కథను శేఖర్ కమ్ముల తెరకెక్కించారని కితాబిచ్చారు. సోలో హీరోగా కాకుండా కుబేర విషయంలో రిస్క్ అనిపించే నిర్ణయాన్ని తీసుకున్న నాగార్జున దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకోవడం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు.

దీన్ని బట్టి సోషల్ మీడియా ట్రెండ్స్ సెలబ్రిటీలు ఎంత సీరియస్ గా ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిదీ చూడకపోయినా టీమ్ తరఫున ఎవరో ఒకరు వీటిని వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. కుబేరలో హీరో ఎవరనే డిబేట్ కూడా నిన్న ట్విట్టర్ వేదికగా జరిగింది. వాటన్నింటికి ఇవాళ చెక్ పడినట్టే. ధనుష్ సైతం నాగార్జున కన్నా ముందు తనే మాట్లాడ్డం ద్వారా మరో పాజిటివ్ సంకేతం ఇచ్చాడు.  ఇప్పుడీ కుబేర ఇచ్చిన సక్సెస్ కిక్ తో నాగార్జున ఆగస్ట్ 14 రాబోయే కూలీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే దర్శక రచయితలకు కొత్త పాత్రలు సృష్టించడంలో ఛాలెంజ్ దొరికినట్టే.

Kumar

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

37 minutes ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

5 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

8 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

8 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

9 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

12 hours ago