ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరు మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులు తెలిసి మాట్లాడినా…తెలియక మాట్లాడినా…కొన్ని కామెంట్లు కాంట్రవర్షియల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా విజయ్ దేవరకొండ మాట్లాడారని కేసు నమోదైంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేదికపై గిరిజనులను విజయ్ దేవరకొండ తీవ్రవాదులతో పోల్చాడన్న ఆరోపణలు రావడంతో ఆ కామెంట్స్ కాంట్రవర్షియల్ గా మారాయి. దీంతో, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని గిరిజనులు ఫైర్ అయ్యారు. విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.
విజయ్ దేవరకొండ గిరిజనులను తీవ్రంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నాంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజన సమాజాన్ని అవమానపరిచేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో గిరిజనులను పోల్చేలా వాఖ్యానించడం వల్ల గిరిజనుల ఆత్మ గౌరవం దెబ్బతిందని కంప్లయింట్ ఇచ్చారు. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on June 22, 2025 3:23 pm
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…
విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…