ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలలో కొందరు మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొందరు ప్రముఖులు తెలిసి మాట్లాడినా…తెలియక మాట్లాడినా…కొన్ని కామెంట్లు కాంట్రవర్షియల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా విజయ్ దేవరకొండ మాట్లాడారని కేసు నమోదైంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేదికపై గిరిజనులను విజయ్ దేవరకొండ తీవ్రవాదులతో పోల్చాడన్న ఆరోపణలు రావడంతో ఆ కామెంట్స్ కాంట్రవర్షియల్ గా మారాయి. దీంతో, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని గిరిజనులు ఫైర్ అయ్యారు. విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.
విజయ్ దేవరకొండ గిరిజనులను తీవ్రంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నాంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజన సమాజాన్ని అవమానపరిచేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో గిరిజనులను పోల్చేలా వాఖ్యానించడం వల్ల గిరిజనుల ఆత్మ గౌరవం దెబ్బతిందని కంప్లయింట్ ఇచ్చారు. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on June 22, 2025 3:23 pm
బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…