పాతిక సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న సంగీత దర్శకులకు ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం పెద్ద సవాల్ గా మారిపోయింది. అంతటి దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవలే థగ్ లైఫ్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాకు ఎంత నిరాశ పరిచే సంగీతం ఇచ్చారో చూశాం. ఒకటి రెండు పాటలు కొందరు మ్యూజిక్ లవర్స్ కి నచ్చి ఉండొచ్చేమో కానీ మునుపటి మార్కు ఆయనలో లేదన్నది వాస్తవం. ఆస్కార్ సాధించిన కీరవాణి, ఇసైజ్ఞాని ఇళయరాజాది కూడా ఇంచుమించు ఇదే కథ. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం కొన్ని విషయాల్లో అవుట్ స్టాండింగ్ అనిపిస్తున్నాడు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నప్పటికి హిట్లు కొడుతున్నాడు.
తాజాగా కుబేరతో మరో సూపర్ మూవీ తన ఖాతాలో వేసుకున్నాడు దేవి. ముఖ్యంగా పాటల కన్నా ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూపించిన ఇంపాక్ట్ మాములుగా లేదు. ఫ్రెష్ గా అనిపించే సౌండ్స్ తో శేఖర్ కమ్ముల విజన్ ని ఎలివేట్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. దీని కన్నా ముందు మొన్న ఫిబ్రవరిలో తండేల్ రూపంలో మరో చార్ట్ బస్టర్ సాధించిన డిఎస్పి గత డిసెంబర్ లో పుష్ప 2 ది రూల్ తో తాను ఎంత పెద్ద రూలరో చాటి చెప్పాడు. వీటికి పూర్వం కంగువ, రత్నం నిరాశపరిచినప్పటికీ అవి తమిళ సినిమాలు. కనక పరిగణనలోకి తీసుకోలేం. టాలీవుడ్ వరకు హ్యాట్రిక్ కన్నా ముందు చేసింది వాల్తేర్ వీరయ్యనే.
ట్రాక్ రికార్డుని పట్టాలు తప్పకుండా మేనేజ్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తనకిచ్చిన బాధ్యత, రెమ్యునరేషన్ రెండింటికి న్యాయం చేకూరుస్తున్నాడు. సుకుమార్ టీమ్ సినిమాలకే బెస్ట్ ఇస్తాడని ముద్ర కూడా ఇప్పుడు లేదు. సినిమాలు ఒప్పుకునే విషయంలో తమన్ అంత దూకుడు చూపించకపోయినా ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న దేవి వీలైనంత బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు. నెక్స్ట్ లిస్టులో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అంచనాలు మాములుగా లేవు. మోహన్ లాల్ వృషభకి సంగీతం సమకూరుస్తున్నాడు. దేవి ప్రోగ్రస్ కార్డు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…