పాతిక సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న సంగీత దర్శకులకు ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం పెద్ద సవాల్ గా మారిపోయింది. అంతటి దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఇటీవలే థగ్ లైఫ్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాకు ఎంత నిరాశ పరిచే సంగీతం ఇచ్చారో చూశాం. ఒకటి రెండు పాటలు కొందరు మ్యూజిక్ లవర్స్ కి నచ్చి ఉండొచ్చేమో కానీ మునుపటి మార్కు ఆయనలో లేదన్నది వాస్తవం. ఆస్కార్ సాధించిన కీరవాణి, ఇసైజ్ఞాని ఇళయరాజాది కూడా ఇంచుమించు ఇదే కథ. కానీ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం కొన్ని విషయాల్లో అవుట్ స్టాండింగ్ అనిపిస్తున్నాడు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నప్పటికి హిట్లు కొడుతున్నాడు.
తాజాగా కుబేరతో మరో సూపర్ మూవీ తన ఖాతాలో వేసుకున్నాడు దేవి. ముఖ్యంగా పాటల కన్నా ఎక్కువ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూపించిన ఇంపాక్ట్ మాములుగా లేదు. ఫ్రెష్ గా అనిపించే సౌండ్స్ తో శేఖర్ కమ్ముల విజన్ ని ఎలివేట్ చేసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. దీని కన్నా ముందు మొన్న ఫిబ్రవరిలో తండేల్ రూపంలో మరో చార్ట్ బస్టర్ సాధించిన డిఎస్పి గత డిసెంబర్ లో పుష్ప 2 ది రూల్ తో తాను ఎంత పెద్ద రూలరో చాటి చెప్పాడు. వీటికి పూర్వం కంగువ, రత్నం నిరాశపరిచినప్పటికీ అవి తమిళ సినిమాలు. కనక పరిగణనలోకి తీసుకోలేం. టాలీవుడ్ వరకు హ్యాట్రిక్ కన్నా ముందు చేసింది వాల్తేర్ వీరయ్యనే.
ట్రాక్ రికార్డుని పట్టాలు తప్పకుండా మేనేజ్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తనకిచ్చిన బాధ్యత, రెమ్యునరేషన్ రెండింటికి న్యాయం చేకూరుస్తున్నాడు. సుకుమార్ టీమ్ సినిమాలకే బెస్ట్ ఇస్తాడని ముద్ర కూడా ఇప్పుడు లేదు. సినిమాలు ఒప్పుకునే విషయంలో తమన్ అంత దూకుడు చూపించకపోయినా ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్న దేవి వీలైనంత బెస్ట్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు. నెక్స్ట్ లిస్టులో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అంచనాలు మాములుగా లేవు. మోహన్ లాల్ వృషభకి సంగీతం సమకూరుస్తున్నాడు. దేవి ప్రోగ్రస్ కార్డు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
This post was last modified on June 20, 2025 9:50 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…