మంచి ఎమోషనల్ మూవీగా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న హాయ్ నాన్న విడుదలై ఏడాదిన్నర గడిచిపోయింది. ఇప్పటిదాకా దర్శకుడు శౌర్యువ్ కొత్త సినిమా మొదలు కాలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అతను జూనియర్ ఎన్టీఆర్ కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఒక కథ గురించి ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరినా తారక్ డేట్లు ఇంకో రెండు మూడేళ్ళ దాకా దొరికే పరిస్థితి లేకపోవడంతో శౌర్యువ్ అప్పటిదాకా వెయిట్ చేయడం కష్టం. దీంతో తిరిగి నాని దగ్గరికే వచ్చి ఓకే చేయించుకున్నట్టు తెలిసింది. ఇది అదే సబ్జెక్టా లేక వేరేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదింకా ప్రాధమిక దశలో ఉంది కాబట్టి నిర్ధారణగా చెప్పలేం.
ప్రస్తుతం నాని ఫోకస్ మొత్తం ది ప్యారడైజ్ మీదే ఉంది. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకున్నా జూలై నుంచి ఏకధాటిగా షూటింగ్ చేయబోతున్నారు. ప్రొడక్షన్ కే పది నెలల సమయం పట్టొచ్చని ఒక అంచనా. ఈ కారణంగా ముందు అనుకున్న మార్చి 26 విడుదల తేదీని మార్చుకునే అవకాశాలున్నాయని ఆల్రెడీ టాక్ ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శౌర్యువ్ చెప్పిన కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. హాయ్ నాన్నలో విపరీతమైన భావోద్వేగాలను చూపించిన ఈ దర్శకుడు ఈసారి కమర్షియల్ రూటు పట్టుకుని కొత్త తరహా స్టోరీ సిద్ధం చేశాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కారణాలు ఏమైనా శౌర్యువ్ లాంటి కొత్త డైరెక్టర్లు ఇన్నేసి నెలలు వెయిట్ చేసి కొత్త సినిమాలు మొదలుపెట్టకపోవడం టాలీవుడ్ లో తరచుగా కనిపిస్తూనే ఉంది. ఈ కారణంగానే సాయి రాజేష్, తరుణ్ భాస్కర్ లాంటి ప్యాన్ ఇండియాలు లేని దర్శకులు సైతం ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకుంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇలా అప్ కమింగ్ డైరెక్టర్లు కూడా అదే బాట పట్టడం థియేటర్లను నెలల తరబడి ఖాళీగా ఉంచుతోంది. ఇప్పుడు శౌర్యువ్ ఎవరి బ్యానర్ లో చేస్తాడు లాంటి వివరాలన్నీ అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాల్సిందే.
This post was last modified on June 19, 2025 11:30 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…