విశ్వంభరకు షూటింగ్ పరంగా బ్యాలన్స్ ఉన్నది ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే. దానికి సరైన హీరోయిన్ దొరక్క దర్శకుడు వశిష్ఠ పెద్ద కసరత్తే చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. విఎఫ్ఎక్స్ పనులు, రిలీజ్ డేట్ ఇంకా నిర్ధారణ చేయకపోవడం వల్ల టీమ్ అయితే ఒత్తిడిలో ఉంది. ఇదిలా ఉండగా కీరవాణి స్వరపరిచిన ఈ పాట చిరంజీవిని అంత సంతృప్తి పరచలేకపోయిందనే టాక్ గతంలోనే వచ్చింది. కొత్త ట్యూన్లు ట్రై చేశారట కానీ అవేవి అంత కిక్ ఇవ్వకపోవడంతో ఇప్పుడా బాధ్యతను భీమ్స్ కి ఇచ్చారని లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా సమాచారం లేదు కానీ అంతర్గతంగా ఓకే అయ్యిందని, త్వరలోనే రికార్డింగ్ ఉంటుందని అంటున్నారు.
ఇలా ఎందుకు జరిగిందనే బ్యాక్ స్టోరీ చూద్దాం. కీరవాణి ప్రస్తుతం హరిహర వీరమల్లు రీ రికార్డింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఫైనల్ కాపీ రెడీ అయ్యింది. దానికి బీజీఎమ్ ఇవ్వాలి. జూలైలోనే రిలీజ్ అంటున్నారు కాబట్టి క్వాలిటీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ పరిస్థితిలో విశ్వంభర కోసం టైం కేటాయించడం కష్టం. అందుకే భీమ్స్ తెరపైకి వచ్చాడని అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157కి అతను ఇచ్చిన పాటలకు బాగా ఇంప్రెస్ అయిన చిరంజీవి స్వయంగా రికమండేషన్ చేశారని అంటున్నారు. ఎంత వరకు నిజమనేది ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావొచ్చు.
సరైన అప్డేట్స్ లేక ఇప్పటికీ బజ్ విషయంలో వెనుకబడిన విశ్వంభర అర్జెంట్ గా ప్రమోషన్ల వేగం పెంచాలి. గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ తర్వాత పబ్లిసిటీ ఒక్కసారిగా సైలెంట్ కావడం మెగాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత ఆలస్యం చేయడం వల్ల క్రేజ్ తగ్గిపోతోందని వాపోతున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో గొప్ప ఫాంటసీ మూవీ ఇస్తానని హామీ ఇచ్చిన వశిష్ట బయట కనిపించడమే మానేశాడు. మెగా 157 ఆల్రెడీ రెండో షెడ్యూల్ మొదలుపెట్టేసుకుంది. చూస్తూ ఉంటే సంక్రాంతికి పండగ వచ్చేసి రావిపూడి సినిమానే ముందు రిలీజవుతుందేమోనని ఫ్యాన్సే పంచులేస్తున్నారు.
This post was last modified on June 18, 2025 9:43 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…