మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత గ్యాప్ తీసుకున్న అనుష్క కొత్త సినిమా ఘాటీ ఏప్రిల్ 18 నుంచి తప్పుకున్నాక కొత్త డేట్ జూలై 11 తీసుకుంది. ఇప్పుడు చేతిలో నెల రోజులు లేకపోయినా ఇంకా ప్రమోషన్లు మొదలు కాకపోవడం ఫ్యాన్స్ లో అనుమానాలు రేపుతోంది. అదే తేదీకి సుహాస్ ఓ భామ అయ్యో రామాని రిలీజ్ చేయడం చూస్తుంటే స్వీటీ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందేమోనని డౌట్ రావడం సహజం. యువి క్రియేషన్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ లేడీ గ్యాంగ్ స్టర్ డ్రామాలో అనుష్క గంజాయి డాన్ గా నటిస్తోంది. ఇప్పటిదాకా ఇంట్రో టీజర్ తప్ప ఎలాంటి ప్రమోషన్ కంటెంట్ వదల్లేదు.
ఈ మౌనం వెనుక కొన్ని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఘాటీ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా అవ్వలేదు. పనులైతే జరుగుతున్నాయి. క్రిష్ బయటికి కనిపించకపోవడానికి కారణం ఇదే. అయితే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాని నేపథ్యంలో రెండింటి మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలనేది ఘాటీ నిర్మాతల ఆలోచన. ఇంకోవైపు ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాల ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంది. థియేటర్ రిలీజ్ డేట్లు ఫైనల్ చేసే విషయంలో ప్రైమ్ షెడ్యూల్స్ కీలకం కాబోతున్నాయి. ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడే ఘాటీ జూన్ 11 తీసుకుందనేది అంతర్గత వర్గాల సమాచారం.
ఒకవేళ అదే డేట్ కి కట్టుబడితే మాత్రం వీలైనంత త్వరగా పబ్లిసిటీ మొదలుపెట్టాలి. అనుష్క ఈసారైనా బయటికి వస్తుందో లేదోననేది ఆసక్తికరంగా మారింది. యువి నిర్మిస్తున్న విశ్వంభర సైతం ఇదే తరహా డోలాయమానంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఘాటీకి అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ సమస్య లేనప్పటికీ ఎందుకు లేట్ అవుతోందనేది అర్థం కానీ ప్రశ్న. బడ్జెట్ ఎక్కువున్నా తక్కువున్నా పేరున్న హీరో హీరోయిన్లు నటించిన సినిమాలకు వాయిదాల పర్వం పరిపాటిగా మారింది. ఘాటీ తర్వాత అనుష్క నటించిన మరో మలయాళం మూవీ కథనర్ కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. ఇది కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోని బాపతే.
This post was last modified on June 17, 2025 9:37 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…