ప్రతి హీరో తన దర్శకుడిని పొగడ్డం మామూలే కానీ.. శేఖర్ కమ్ములను గురించి అక్కినేని నాగార్జున కొనియాడుతున్న తీరు మాత్రం ప్రత్యేకం. ఏదో పొగడాలి కాబట్టి పొగడాలి అన్నట్లు కాకుండా శేఖర్ గురించి నాగ్ చెప్పే మాటలన్నీ మనసు లోతుల్లోంచి వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. బేసిగ్గా శేఖర్తో పని చేసిన ప్రతి ఒక్కరూ తన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతుంటారు. ఆయన తమను వ్యక్తితంగా ఎంత ప్రభావితం చేశాడో చెబుతుంటారు. నాగ్ కూడా అందుకు మినహాయింపు కాలేదు.
మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘మాయాబజార్’కు కేవీ రెడ్డి ఎలా హీరోనో.. ‘కుబేర’కు తాను, ధనుష్ కాకుండా కమ్ములనే హీరో అంటూ గొప్ప ఎలివేషన్ ఇచ్చిన నాగ్.. తాజాగా ‘కుబేర’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సైతం కమ్ముల మీద ప్రశంసల జల్లు కురిపించాడు. తనతో పని చేయడం చాలా హాయిగా ఉంటుందని.. వ్యక్తిగా అతను చాలా అరుదైన వాడని అన్నాడు. శేఖర్ కమ్ములతో పని చేయాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని.. ఐతే తనకంటే ముందు తన కొడుకు నాగచైతన్యకు ఆ అవకాశం లభించిందని నాగ్ చెప్పాడు.
ఈ విషయంలో అతను సీనియర్ కాబట్టి శేఖర్తో ఎలా ఉంటుంది అని అడిగానని.. ఒక చిన్న పిల్లాడిలా చాలా స్వచ్ఛంగా ఉంటాడని చెప్పాడన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ జరిగేన్ని రోజులు మీరు చాలా లక్కీ.. షూట్ అయ్యాక మీరు కొత్త వ్యక్తిగా మారతారు అని చెప్పాడని నాగ్ గుర్తు చేసుకున్నాడు. చైతూ చెప్పింది అక్షరాలా నిజమని.. తనది స్వచ్ఛమైన హృదయమని.. తన మీద వ్యక్తిగతంగా కమ్ముల ఎంతో ప్రభావం చూపించాడని నాగ్ చెప్పాడు. ‘కుబేర’కు సంబంధించి చెన్నైలో జరిగిన ఈవెంట్లో ధనుష్ తమిళంలో మాట్లాడుతూ.. కమ్ముల లాంటి వాళ్లు ఉండడం వల్లే ఇంకా వర్షాలు పడుతున్నాయని అన్నాడని.. ఐతే అతనేం మాట్లాడాడో అర్థం కాకుండానే కమ్ముల పిల్లాడిలా చప్పట్లు కొడుతూ కనిపించాడని.. ధనుష్ ఏం చెప్పాడో తాను తర్వాత వివరించానని నాగ్ గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on June 17, 2025 11:06 am
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…