Movie News

అవార్డులు వచ్చి తీసుకోండి – దిల్ రాజు

నిన్న జరిగిన గద్దర్ అవార్డుల వేడుక విజయవంతంగా జరిగిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎఫ్డిసి చైర్ మెన్ గా తెలంగాణ ప్రభుత్వం తరఫున కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఈవెంట్ కు సంబంధించి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అయితే కొన్ని అవార్డులు తీసుకునేందుకు విజేతలు కాకుండా వాళ్ళ తరఫున ప్రతినిధులు రావడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమైన మాట వాస్తవం. దిల్ రాజు దీని గురించే నొక్కి చెబుతున్నారు. పురస్కారం అందుకోవాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే డైరీలో డేట్ నోట్ చేసుకుని రావాలని, ప్రభుత్వంతో ప్రయాణంలో ఇది కూడా ఒక బాధ్యతేనేని గుర్తు చేశారు.

ఆయన చేసిన విన్నపంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన అవార్డులను కాంగ్రెస్ సర్కార్ తిరిగి తీసుకొచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నంది పేరుతో వీటిని ఇచ్చేవాళ్లు. టాలీవుడ్ ఆస్కార్ రేంజ్ లో ఇవి తీసుకున్న వాళ్లకు గుర్తింపు ఉండేది. అలాంటప్పుడు అందరూ హాజరైతే ఆ కళ వేరుగా ఉంటుంది. కానీ నిన్న కొందరి గైర్హాజరు గవర్నమెంట్ పెద్దల దృష్టిలో రాకుండా పోదు. ఎందుకంటే ఇలాంటి వేడుకలకు శాశ్వతత్వం ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఫలనా గద్దర్ అవార్డు మొదటి ఈవెంట్ ఎలా జరిగిందని వీడియో రూపంలో చూసుకుంటే అది కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలి.

త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని దిల్ రాజు చెప్పారు. అవి ఈ సంవత్సరం నుంచే ప్రారంభమవుతాయా లేక వచ్చే ఏడాది నుంచి ఉంటాయా అనేది చెప్పలేదు కానీ ప్రస్తుతానికి కార్యాచరణ జరుగుతోందనే హింట్ అయితే ఇచ్చారు. వేడుకకు రానివాళ్ళ గురించి ఇప్పుడు చెప్పకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీటయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా అలెర్ట్ చేయడం మంచిదే. ఇకపై గద్దర్ అవార్డులు క్రమం తప్పకుండ జరగబోతున్నాయి. ఏపీలో నంది పేరుతోనే పునఃప్రారంభం కావొచ్చని అంచనా. నిన్న చాలా మంది సీనియర్ స్టార్లు, టయర్ 2 హీరోలు కనిపించకపోవడం కొంత లోటుగానే అనిపించింది.

This post was last modified on June 15, 2025 7:22 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

33 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago