వెబ్ సిరీస్ ట్రెండ్ను బాలీవుడ్ చాలా ముందుగా అడాప్ట్ చేసుకుంది. అక్కడ సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్.. ఇలా పెద్ద పెద్ద తారలు వెబ్ సిరీస్లు చేశారు. కానీ సౌత్లో మాత్రం స్టార్ హీరోలు అటు వైపే చూడలేదు. ఇక్కడ తెరకెక్కిన వెబ్ సిరీస్లే తక్కువ అంటే.. స్టార్లు అసలే నటించలేదు. కానీ ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రం ధైర్యం చేసి రెండేళ్ల ముందు అడుగు ముందుకు వేశారు. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి ‘రానా నాయుడు’ సిరీస్ చేశారు. దీన్ని పాన్ ఇండియా సిరీస్గా చెప్పుకోవచ్చు.
హాలీవుడ్ టీవీ షో ‘రే డొనోవన్’ ఆధారంగా నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ను రూపొందించింది. కానీ తొలి సీజన్ చూసిన వెంకీ అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. వెంకీ నోట వచ్చిన బూతు డైలాగులు.. సినిమాలో శ్రుతి మించిన శృంగార సన్నివేశాలు చూసి ఆయన ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. కొన్ని సీన్లు చూసి తట్టుకోలేక.. సిరీస్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిన వాళ్లు చాలామందే ఉంటారు. నిజానికి సీజన్-1 ఇంట్రెస్టింగ్గా సాగినా.. వల్గారిటీ ఎక్కువనే కారణంతోనే మన వాళ్లు దాన్ని అంతగా ఆదరించలేదు.
ఇప్పుడిక సీజన్-2 వచ్చింది. ఫస్ట్ సీజన్ ఫీడ్ బ్యాక్ను దృష్టిలో ఉంచుకుని బూతులు, బోల్డ్ సీన్ల డోస్ తగ్గించారు. ఉన్నంతలో కొంచెం నీట్గానే సిరీస్ తీశారు. కానీ ఈసారి కంటెంట్ మరీ వీకైపోయింది. ముఖ్యంగా వెంకీ పాత్రను అయితే మేకర్స్ తేల్చిపడేశారు. ఓవరాల్గా సిరీస్ వీక్ అయినా.. రానా పాత్ర బాగానే హైలైట్ అయింది. తన పాత్ర బాగుంది. కానీ వెంకీ పాత్ర మాత్రం కూరలో కరివేపాకులా తయారైంది.
ఇందులో వెంకీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్లు చేశారు. కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో వెంకీ కూడా మొక్కుబడిగా నటించినట్లు అనిపిస్తుంది. ఆయన లుక్ కూడా కృత్రిమంగా అనిపించి.. అంతగా ఆకట్టుకోలేదు. ఇంకో సీజన్ పూర్తి చేయాలి కాబట్టి వెంకీ మమ అనిపించినట్లున్నాడు. మొత్తంగా వెంకీ డిజిటల్ ఎంట్రీ ఆయనతో పాటు అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలేలా ఉంది.
This post was last modified on June 14, 2025 11:11 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…