వెబ్ సిరీస్ ట్రెండ్ను బాలీవుడ్ చాలా ముందుగా అడాప్ట్ చేసుకుంది. అక్కడ సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్.. ఇలా పెద్ద పెద్ద తారలు వెబ్ సిరీస్లు చేశారు. కానీ సౌత్లో మాత్రం స్టార్ హీరోలు అటు వైపే చూడలేదు. ఇక్కడ తెరకెక్కిన వెబ్ సిరీస్లే తక్కువ అంటే.. స్టార్లు అసలే నటించలేదు. కానీ ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రం ధైర్యం చేసి రెండేళ్ల ముందు అడుగు ముందుకు వేశారు. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి ‘రానా నాయుడు’ సిరీస్ చేశారు. దీన్ని పాన్ ఇండియా సిరీస్గా చెప్పుకోవచ్చు.
హాలీవుడ్ టీవీ షో ‘రే డొనోవన్’ ఆధారంగా నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ను రూపొందించింది. కానీ తొలి సీజన్ చూసిన వెంకీ అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. వెంకీ నోట వచ్చిన బూతు డైలాగులు.. సినిమాలో శ్రుతి మించిన శృంగార సన్నివేశాలు చూసి ఆయన ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. కొన్ని సీన్లు చూసి తట్టుకోలేక.. సిరీస్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిన వాళ్లు చాలామందే ఉంటారు. నిజానికి సీజన్-1 ఇంట్రెస్టింగ్గా సాగినా.. వల్గారిటీ ఎక్కువనే కారణంతోనే మన వాళ్లు దాన్ని అంతగా ఆదరించలేదు.
ఇప్పుడిక సీజన్-2 వచ్చింది. ఫస్ట్ సీజన్ ఫీడ్ బ్యాక్ను దృష్టిలో ఉంచుకుని బూతులు, బోల్డ్ సీన్ల డోస్ తగ్గించారు. ఉన్నంతలో కొంచెం నీట్గానే సిరీస్ తీశారు. కానీ ఈసారి కంటెంట్ మరీ వీకైపోయింది. ముఖ్యంగా వెంకీ పాత్రను అయితే మేకర్స్ తేల్చిపడేశారు. ఓవరాల్గా సిరీస్ వీక్ అయినా.. రానా పాత్ర బాగానే హైలైట్ అయింది. తన పాత్ర బాగుంది. కానీ వెంకీ పాత్ర మాత్రం కూరలో కరివేపాకులా తయారైంది.
ఇందులో వెంకీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్లు చేశారు. కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో వెంకీ కూడా మొక్కుబడిగా నటించినట్లు అనిపిస్తుంది. ఆయన లుక్ కూడా కృత్రిమంగా అనిపించి.. అంతగా ఆకట్టుకోలేదు. ఇంకో సీజన్ పూర్తి చేయాలి కాబట్టి వెంకీ మమ అనిపించినట్లున్నాడు. మొత్తంగా వెంకీ డిజిటల్ ఎంట్రీ ఆయనతో పాటు అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలేలా ఉంది.
This post was last modified on June 14, 2025 11:11 pm
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…