Movie News

వెంకీ ఫ్యాన్స్‌కు ఈసారి ఇలా షాకిచ్చారు

వెబ్ సిరీస్‌ ట్రెండ్‌ను బాలీవుడ్ చాలా ముందుగా అడాప్ట్ చేసుకుంది. అక్కడ సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్.. ఇలా పెద్ద పెద్ద తారలు వెబ్ సిరీస్‌లు చేశారు. కానీ సౌత్‌లో మాత్రం స్టార్ హీరోలు అటు వైపే చూడలేదు. ఇక్కడ తెరకెక్కిన వెబ్ సిరీస్‌లే తక్కువ అంటే.. స్టార్లు అసలే నటించలేదు. కానీ ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మాత్రం ధైర్యం చేసి రెండేళ్ల ముందు అడుగు ముందుకు వేశారు. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి ‘రానా నాయుడు’ సిరీస్ చేశారు. దీన్ని పాన్ ఇండియా సిరీస్‌గా చెప్పుకోవచ్చు.

హాలీవుడ్ టీవీ షో ‘రే డొనోవన్’ ఆధారంగా నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను రూపొందించింది. కానీ తొలి సీజన్ చూసిన వెంకీ అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. వెంకీ నోట వచ్చిన బూతు డైలాగులు.. సినిమాలో శ్రుతి మించిన శృంగార సన్నివేశాలు చూసి ఆయన ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. కొన్ని సీన్లు చూసి తట్టుకోలేక.. సిరీస్ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిన వాళ్లు చాలామందే ఉంటారు. నిజానికి సీజన్-1 ఇంట్రెస్టింగ్‌గా సాగినా.. వల్గారిటీ ఎక్కువనే కారణంతోనే మన వాళ్లు దాన్ని అంతగా ఆదరించలేదు.

ఇప్పుడిక సీజన్-2 వచ్చింది. ఫస్ట్ సీజన్ ఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో ఉంచుకుని బూతులు, బోల్డ్ సీన్ల డోస్ తగ్గించారు. ఉన్నంతలో కొంచెం నీట్‌గానే సిరీస్ తీశారు. కానీ ఈసారి కంటెంట్ మరీ వీకైపోయింది. ముఖ్యంగా వెంకీ పాత్రను అయితే మేకర్స్ తేల్చిపడేశారు. ఓవరాల్‌గా సిరీస్ వీక్ అయినా.. రానా పాత్ర బాగానే హైలైట్ అయింది. తన పాత్ర బాగుంది. కానీ వెంకీ పాత్ర మాత్రం కూరలో కరివేపాకులా తయారైంది.

ఇందులో వెంకీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్లు చేశారు. కథలో ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో వెంకీ కూడా  మొక్కుబడిగా నటించినట్లు అనిపిస్తుంది. ఆయన లుక్ కూడా కృత్రిమంగా అనిపించి.. అంతగా ఆకట్టుకోలేదు. ఇంకో సీజన్ పూర్తి చేయాలి కాబట్టి వెంకీ మమ అనిపించినట్లున్నాడు. మొత్తంగా వెంకీ డిజిటల్ ఎంట్రీ ఆయనతో పాటు అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలేలా ఉంది.

This post was last modified on June 14, 2025 11:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

46 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

1 hour ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

1 hour ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

2 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago