సరిగ్గా ఆరు నెలల క్రితం పుష్ప 2 కి సంబంధించి సంధ్య థియేటర్ దుర్ఘటన వల్ల పోలీసు కేసులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడిన అల్లు అర్జున్ కి గద్దర్ అవార్డుల వేడుక ఒక అరుదైన జ్ఞాపకంగా నిలిచిపోనుంది. చట్టప్రకారమే చర్యలు తీసుకున్నప్పటికీ ఏ ప్రభుత్వం ద్వారా అయితే తాను న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడదే తెలంగాణ సర్కారు ప్రకటించిన గద్దర్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకోవడం బన్నీ కన్నా ఎక్కువ అభిమానులకు స్పెషల్ గా గుర్తుండి పోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద అవార్డు అందుకున్న ఐకాన్ స్టేజి వేదిక మీద మాట్లాడింది రెండు నిమిషాలే అయినా మంచి కిక్ ఇచ్చాడు.
తనకు ఈ గౌరవం దక్కేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, దర్శకుడు సుకుమార్ తో పాటు పని చేసిన ప్రతి ఒక్కరు తన విజయంలో భాగమని చెప్పిన బన్నీ సిఎం రేవంత్ రెడ్డిని అన్నా అంటూ సంబోధించడం ఆకర్షణగా నిలిచింది. డిప్యూటీ సిఎం భట్టి గారు అంటూ ఆయనతో చనువుని బయటపెట్టిన బన్నీ ఇది సినిమా ఈవెంట్ కాబట్టి ఒక డైలాగు చెబుతానంటూ రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోవడం ఆకట్టుకుంది. పుష్ప 2 క్లైమాక్స్ లో వచ్చే రప్పా రప్పా సంభాషణను అదే గంభీరతతో పలుకుతూ చివర్లో తగ్గేదేలా అని చెప్పడం అక్కడున్న ఆహుతులతో చప్పట్లు కొట్టించేలా చేసింది. మధ్యలో రాజమౌళికి థాంక్స్ చెప్పాడు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే థాంక్ యు, తగ్గేదేలే అంటూ రెండూ తన స్పీచ్ లో పొందుపరిచిన అల్లు అర్జున్ అందులో వేరే ఉద్దేశాలు ఏవీ లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం భలే హ్యాపీగా ఫీలవుతున్నారు. పడ్డ చోటే గెలవడమంటే ఇదేనంటూ దీని తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ముంబై షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఈ ఫంక్షన్ కోసం బ్రేక్ తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. మొదటిసారి పునఃప్రవేశ పెట్టిన అవార్డులు కావడంతో విజేతలు అందరూ విచ్చేశారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్లు మిస్ కావడం కొంత లోటే అయినా వేడుక ఘనంగా జరిగింది.
This post was last modified on June 14, 2025 10:53 pm
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…