మాస్ రాజా రవితేజ కెరీర్కు చాలా కీలకమైన సినిమా ‘క్రాక్’. చాలా ఏళ్లుగా ఆయనకి సరైన విజయం లేదు. చివరగా మాస్ రాజా నుంచి వచ్చిన ‘డిస్కో రాజా’ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వల్ల ప్రయోగాలు అవ్వవని ఫిక్సయిపోయి అలవాటైన మాస్ సినిమాల్లోకి దిగిపోయాడు రవితేజ. పూర్తిగా మాస్ రాజా స్టయిల్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘క్రాక్’. ఇంతకుముందు రవితేజకు డాన్ శీను, బలుపు లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కరోనా విరామం మధ్య నెల కిందటే షూటింగ్ పున:ప్రారంభించారు. టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి చేశారు. కానీ అంతా అయ్యాక ఒకసారి రషెస్ చూసుకుంటే కొన్ని సన్నివేశాలు అనుకున్నంత ఎఫెక్టివ్గా లేరని భావించిందట చిత్ర బృందం.
రవితేజకు ఈ సినిమా హిట్టవడం అత్యావశ్యకం కావడంతో సంతృప్తికరంగా లేని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఫిక్సయ్యారట. ఒంగోలు ప్రాంతంలో ఆ సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ఆ సీన్లన్నీ పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు వెళ్లిపోతారని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో రీషూట్లు అంటే దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగా భావించేవాళ్లు. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి కొన్ని సినిమాలు రీషూట్లు చేసుకునే మంచి ఫలితాన్నందుకున్నాయి.
రష్ చూసుకుని కరెక్షన్లు చేసుకుంటే తప్పేమీ లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలపడింది. కాబట్టి ‘క్రాక్’కు రిపేర్లు జరగడాన్ని నెగెటివ్గా ఏమీ చూడాల్సిన పని లేదు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’ స్ఫూర్తితో తెరకెక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ సినిమాను ఆల్రెడీ ‘జయదేవ్’ పేరుతో రీమేక్ చేయగా.. దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.
This post was last modified on November 11, 2020 1:51 pm
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…