Movie News

‘క్రాక్‌’కు రిపేర్లు చేస్తున్నారా?

మాస్ రాజా రవితేజ కెరీర్‌కు చాలా కీలకమైన సినిమా ‘క్రాక్’. చాలా ఏళ్లుగా ఆయనకి సరైన విజయం లేదు. చివరగా మాస్ రాజా నుంచి వచ్చిన ‘డిస్కో రాజా’ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వల్ల ప్రయోగాలు అవ్వవని ఫిక్సయిపోయి అలవాటైన మాస్ సినిమాల్లోకి దిగిపోయాడు రవితేజ. పూర్తిగా మాస్ రాజా స్టయిల్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘క్రాక్’. ఇంతకుముందు రవితేజకు డాన్ శీను, బలుపు లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కరోనా విరామం మధ్య నెల కిందటే షూటింగ్ పున:ప్రారంభించారు. టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి చేశారు. కానీ అంతా అయ్యాక ఒకసారి రషెస్ చూసుకుంటే కొన్ని సన్నివేశాలు అనుకున్నంత ఎఫెక్టివ్‌గా లేరని భావించిందట చిత్ర బృందం.

రవితేజకు ఈ సినిమా హిట్టవడం అత్యావశ్యకం కావడంతో సంతృప్తికరంగా లేని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఫిక్సయ్యారట. ఒంగోలు ప్రాంతంలో ఆ సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ఆ సీన్లన్నీ పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్లిపోతారని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో రీషూట్లు అంటే దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగా భావించేవాళ్లు. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి కొన్ని సినిమాలు రీషూట్లు చేసుకునే మంచి ఫలితాన్నందుకున్నాయి.

రష్ చూసుకుని కరెక్షన్లు చేసుకుంటే తప్పేమీ లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలపడింది. కాబట్టి ‘క్రాక్’కు రిపేర్లు జరగడాన్ని నెగెటివ్‌గా ఏమీ చూడాల్సిన పని లేదు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’ స్ఫూర్తితో తెరకెక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ సినిమాను ఆల్రెడీ ‘జయదేవ్’ పేరుతో రీమేక్ చేయగా.. దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.

This post was last modified on November 11, 2020 1:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

40 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago