మాస్ రాజా రవితేజ కెరీర్కు చాలా కీలకమైన సినిమా ‘క్రాక్’. చాలా ఏళ్లుగా ఆయనకి సరైన విజయం లేదు. చివరగా మాస్ రాజా నుంచి వచ్చిన ‘డిస్కో రాజా’ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వల్ల ప్రయోగాలు అవ్వవని ఫిక్సయిపోయి అలవాటైన మాస్ సినిమాల్లోకి దిగిపోయాడు రవితేజ. పూర్తిగా మాస్ రాజా స్టయిల్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘క్రాక్’. ఇంతకుముందు రవితేజకు డాన్ శీను, బలుపు లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కరోనా విరామం మధ్య నెల కిందటే షూటింగ్ పున:ప్రారంభించారు. టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి చేశారు. కానీ అంతా అయ్యాక ఒకసారి రషెస్ చూసుకుంటే కొన్ని సన్నివేశాలు అనుకున్నంత ఎఫెక్టివ్గా లేరని భావించిందట చిత్ర బృందం.
రవితేజకు ఈ సినిమా హిట్టవడం అత్యావశ్యకం కావడంతో సంతృప్తికరంగా లేని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఫిక్సయ్యారట. ఒంగోలు ప్రాంతంలో ఆ సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ఆ సీన్లన్నీ పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు వెళ్లిపోతారని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో రీషూట్లు అంటే దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగా భావించేవాళ్లు. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి కొన్ని సినిమాలు రీషూట్లు చేసుకునే మంచి ఫలితాన్నందుకున్నాయి.
రష్ చూసుకుని కరెక్షన్లు చేసుకుంటే తప్పేమీ లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలపడింది. కాబట్టి ‘క్రాక్’కు రిపేర్లు జరగడాన్ని నెగెటివ్గా ఏమీ చూడాల్సిన పని లేదు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’ స్ఫూర్తితో తెరకెక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ సినిమాను ఆల్రెడీ ‘జయదేవ్’ పేరుతో రీమేక్ చేయగా.. దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.
This post was last modified on November 11, 2020 1:51 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…