మాస్ రాజా రవితేజ కెరీర్కు చాలా కీలకమైన సినిమా ‘క్రాక్’. చాలా ఏళ్లుగా ఆయనకి సరైన విజయం లేదు. చివరగా మాస్ రాజా నుంచి వచ్చిన ‘డిస్కో రాజా’ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వల్ల ప్రయోగాలు అవ్వవని ఫిక్సయిపోయి అలవాటైన మాస్ సినిమాల్లోకి దిగిపోయాడు రవితేజ. పూర్తిగా మాస్ రాజా స్టయిల్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘క్రాక్’. ఇంతకుముందు రవితేజకు డాన్ శీను, బలుపు లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కరోనా విరామం మధ్య నెల కిందటే షూటింగ్ పున:ప్రారంభించారు. టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి చేశారు. కానీ అంతా అయ్యాక ఒకసారి రషెస్ చూసుకుంటే కొన్ని సన్నివేశాలు అనుకున్నంత ఎఫెక్టివ్గా లేరని భావించిందట చిత్ర బృందం.
రవితేజకు ఈ సినిమా హిట్టవడం అత్యావశ్యకం కావడంతో సంతృప్తికరంగా లేని సన్నివేశాలను రీషూట్ చేయాలని ఫిక్సయ్యారట. ఒంగోలు ప్రాంతంలో ఆ సన్నివేశాలను మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ఆ సీన్లన్నీ పూర్తి చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు వెళ్లిపోతారని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో రీషూట్లు అంటే దాన్నో నెగెటివ్ సెంటిమెంటుగా భావించేవాళ్లు. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి కొన్ని సినిమాలు రీషూట్లు చేసుకునే మంచి ఫలితాన్నందుకున్నాయి.
రష్ చూసుకుని కరెక్షన్లు చేసుకుంటే తప్పేమీ లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలపడింది. కాబట్టి ‘క్రాక్’కు రిపేర్లు జరగడాన్ని నెగెటివ్గా ఏమీ చూడాల్సిన పని లేదు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’ స్ఫూర్తితో తెరకెక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ సినిమాను ఆల్రెడీ ‘జయదేవ్’ పేరుతో రీమేక్ చేయగా.. దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.
This post was last modified on November 11, 2020 1:51 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…